NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ
    భారతదేశం

    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ

    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 21, 2023, 03:24 pm 1 నిమి చదవండి
    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ
    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత

    ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మంగళవారం అధికారులు విచారిస్తున్నారు. మూడో దఫా విచారణలో భాగంగా కవిత ఇప్పటి వరకు తాను ఉపయోగించిన అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించారు. ఈడీ కార్యాలయానికి మంగళవారం వెళ్లే ముందే వీడియాకు ఫోన్లను కవిత చూపించారు. అనంతరం ఈడీ అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులకు కవిత ఒక లేఖను కూడా సమర్పించారు. ఈ ఫోన్‌లు తన హక్కని, పక్షపాతం లేకుండా సమర్పించినట్లు కవిత లేఖలో పేర్కొన్నారు. ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం అంటే ఆమే గోప్యతా హక్కులకు భంగం కలిగించడం కాదా అని ప్రశ్నించారు.

    నన్ను అడగకుండానే ఈడీ అధికారులు ఎందుకు ఆరోపణలు చేశారు: కవిత

    తాను ఫోన్లను ధ్వంసం చేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపిందని, కనీసం తనను అడగకుండా ఈడీ ఎందుకు ఈ ఆరోపణలు చేసినట్లు కవిత ప్రశ్నించారు. ఈడీ తనను తొలిసారిగా మార్చిలో విచారణకు పిలిచిందని, కానీ గతేడాది నవంబర్‌లోనే ఫోన్లు ధ్వంసం చేసినట్లు ఆరోపించడంలో దురుద్దేశం లేదా అని అడిగారు. మార్చి 11, మార్చి 20తేదీల్లో దిల్లీలోని ప్రధాన కార్యాలయాల్లో ఈడీ విచారించింది. దీంతో రెండు రోజులు కలిపి కవితను ఈడీ సుమారు 18-19 గంటలు పాటు విచారించింది. మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితను ఈడీ విచారిస్తోంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    కల్వకుంట్ల కవిత
    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    దిల్లీ
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    కల్వకుంట్ల కవిత

    ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో విషాదం తెలంగాణ
    'ఫోన్లను ఓపెన్ చేసేందుకు సిద్ధం'; కవితకు లేఖ రాసిన ఈడీ జాయింట్ డైరెక్టర్ తాజా వార్తలు
    దిల్లీ మద్యం పాలసీ కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా తాజా వార్తలు
    దిల్లీ మద్యం కేసు: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ సుప్రీంకోర్టు

    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    దిల్లీలో బీఆర్ఎస్ శాశ్వత భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్  దిల్లీ
    దిల్లీకి సీఎం కేసీఆర్; రేపు బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    నేడే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభం; 150ఏళ్లైనా చెక్క చెదరకుండా నిర్మాణం  తెలంగాణ
    తెలంగాణ భవన్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు  తెలంగాణ

    దిల్లీ

    కొత్త పార్లమెంట్‌ వద్ద మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం రెజ్లింగ్
    కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే లోక్‌సభ
    కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్‌ ఇదే నరేంద్ర మోదీ

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    దిల్లీ మద్యం పాలసీ కేసు: ఛార్జిషీట్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చిన ఈడీ  దిల్లీ
    ఈడీ విచారణను బైజూస్ ఎందుకు ఎదుర్కొంటుందో తెలుసా?  తాజా వార్తలు
    థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టు; చికోటి ప్రవీణ్ అరెస్టు థాయిలాండ్
    విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ  బీబీసీ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023