Page Loader
Telangana: తీన్మార్ మల్లన్న మాటలపై మహిళా సంఘాల అభ్యంతరం.. కమిషన్‌కు ఫిర్యాదు!
తీన్మార్ మల్లన్న మాటలపై మహిళా సంఘాల అభ్యంతరం.. కమిషన్‌కు ఫిర్యాదు!

Telangana: తీన్మార్ మల్లన్న మాటలపై మహిళా సంఘాల అభ్యంతరం.. కమిషన్‌కు ఫిర్యాదు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 14, 2025
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో చర్చకు కేంద్ర బిందువైన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో, తెలంగాణ జాగృతి మహిళా విభాగం నేతలు రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద అందుబాటులో లేకపోవడంతో, జాగృతి మహిళా విభాగం నాయకులు తమ ఫిర్యాదు లేఖను సభ్యులు సుదం లక్ష్మీ, రేవతి రావు, ఉమ, అప్రోజ్ సహీనాలకు అందజేశారు. అయితే, కమిషన్ సెక్రటరీ పద్మజా రమణ మాత్రం ఛైర్‌పర్సన్ లేనందున లేఖను తాను స్వీకరించనని, సభ్యులకే ఇవ్వాలంటూ వెళ్లిపోయారు.

Details

క్షమాపణ చెప్పకపోవడమే కారణం

ఫిర్యాదులో జాగృతి నేతలు, తీన్మార్ మల్లన్న తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోవడమే కాకుండా, అదే రోజు మరింతగా తీవ్రంగా ఎమ్మెల్సీ కవితను దూషించిన విషయాన్ని వివరించారు. మల్లన్న మాటలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, అవి అసభ్యకరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు మహిళల పట్ల గౌరవాన్ని తగ్గిస్తున్నాయని, ఇటువంటి వ్యవహారంపై మహిళా కమిషన్ తక్షణమే చొరవ చూపించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు లేఖను సభ్యులకే అందజేసి చర్యలు కోరారు.