Page Loader
Bhatti: తెలంగాణలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవరే లక్ష్యం: భట్టి విక్రమార్క
తెలంగాణలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవరే లక్ష్యం: భట్టి విక్రమార్క

Bhatti: తెలంగాణలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవరే లక్ష్యం: భట్టి విక్రమార్క

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2024
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రం పర్యావరణ అనుకూల విద్యుత్ ఉత్పత్తిలో ముందంజలో ఉంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకృతి వనరులను వినియోగించి కాలుష్యరహితంగా 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ప్రకటించారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి పైలట్ ప్రాజెక్టు కింద గ్రామాలను ఎంపిక చేస్తామని ఆయన వెల్లడించారు. వ్యవసాయ రంగానికి రూ. 73 వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉండి రుణమాఫీ, పంటల బీమా వంటి పథకాలను కొనసాగించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. మునుపటి పాలకులు అరకొర రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని, కానీ తాము పూర్తి రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు.

Details

పవర్ ప్లాంట్ ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో రూ. 36.50 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు పూర్తి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. పంటల బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే భవిష్యత్‌లో చెల్లించేందుకు చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.