NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Yadadri Power Plant: భారీగా పెరిగిన యాదాద్రి విద్యుత్కేంద్ర వ్యయం.. జూన్‌ నాటికి నిర్మాణం పూర్తి 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Yadadri Power Plant: భారీగా పెరిగిన యాదాద్రి విద్యుత్కేంద్ర వ్యయం.. జూన్‌ నాటికి నిర్మాణం పూర్తి 
    భారీగా పెరిగిన యాదాద్రి విద్యుత్కేంద్ర వ్యయం.. జూన్‌ నాటికి నిర్మాణం పూర్తి

    Yadadri Power Plant: భారీగా పెరిగిన యాదాద్రి విద్యుత్కేంద్ర వ్యయం.. జూన్‌ నాటికి నిర్మాణం పూర్తి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 27, 2025
    08:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నల్గొండ జిల్లా దామెరచర్ల సమీపంలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి విద్యుత్కేంద్రం వ్యయం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

    ప్రారంభ అంచనా ప్రకారం రూ.29,900 కోట్లు ఉండాల్సిన వ్యయం, నిర్మాణ పనుల తీవ్ర జాప్యం కారణంగా రూ.36,131.99 కోట్లకు చేరినట్లు రాష్ట్ర ఇంధనశాఖ వెల్లడించింది.

    ఈ వివరాలను శాసనసభలో సమర్పించిన విధాన వివరణ పత్రంలో పొందుపరిచింది.

    ప్రస్తుత అంచనాల ప్రకారం, ఈ విద్యుత్కేంద్ర నిర్మాణం జూన్ 2025 నాటికి పూర్తవుతుందని పేర్కొంది.

    వివరాలు 

    పనుల జాప్యం, జరిమానా విధింపు 

    ఈ ప్రాజెక్టు నిర్మాణం 2017లో ప్రారంభమవగా, 2022 నాటికి పూర్తి కావాల్సిన ప్రణాళిక ఉండేది.

    అయితే అనేక కారణాల వల్ల పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది.

    ఈ ఆలస్యంతో రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) నష్టపోయిందని ప్రకటించింది.

    నిర్మాణ బాధ్యతలు చేపట్టిన భెల్ సంస్థపై రూ.400 కోట్ల జరిమానా విధించినట్లు తెలిపింది.

    వివరాలు 

    ప్లాంట్ల నిర్మాణ పురోగతి 

    యాదాద్రి విద్యుత్కేంద్రంలో మొత్తం 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, ఒక్కో ప్లాంట్ 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించబడుతోంది.

    రెండో ప్లాంట్ నిర్మాణం పూర్తయి, వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది.

    మొదటి ప్లాంట్ ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది.

    మిగిలిన మూడు ప్లాంట్లు వరుసగా ఏప్రిల్, మే, జూన్ చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించే అవకాశముంది.

    గత ఏడాది జెన్‌కో పాలకమండలి, ఈ ప్రాజెక్టును 2023 చివరి నాటికి పూర్తిచేయాలని తీర్మానించినప్పటికీ, తాజాగా జూన్ 2025 నాటికి పూర్తవుతుందని ప్రభుత్వం తెలిపింది. అయితే, మరికొంత ఆలస్యం జరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    వివరాలు 

    దేశంలోనే అతిపెద్ద విద్యుత్కేంద్రం 

    రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఒకే ప్రదేశంలో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విద్యుత్కేంద్రం నిర్మించడం ఇదే తొలిసారి. ఇది దేశంలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా గుర్తింపు పొందనుంది.

    వివరాలు 

    గత 3 బడ్జెట్లలో ప్రభుత్వ సహాయ నిధులు కేటాయించలేదు 

    థర్మల్ విద్యుత్కేంద్రాల నిర్మాణ వ్యయంలో 80% రుణాల ద్వారా, మిగతా 20% ప్రభుత్వ వాటాగా కేటాయించాల్సి ఉంటుంది.

    కొత్తగూడెం (800 మెగావాట్లు), భద్రాద్రి (1,080 మెగావాట్లు), యాదాద్రి (4,000 మెగావాట్లు) విద్యుత్కేంద్రాలను జెన్‌కో నిర్మిస్తున్నప్పటికీ, గత మూడేళ్ల బడ్జెట్లలో ప్రభుత్వ వాటా కేటాయించలేదని వెల్లడించింది.

    ప్రస్తుతం కొత్త బడ్జెట్‌లో రూ.7,180 కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదించామని పేర్కొంది.

    అయితే, ప్రభుత్వ నిధులు ఆలస్యమవ్వడంతో జెన్‌కో సంస్థ భెల్‌కు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేస్తోందని సమాచారం.

    ప్రస్తుతం రూ.500 కోట్లకు పైగా బిల్లులు పెండింగులో ఉన్నాయని, ఇంతకుముందు విధించిన జరిమానా రద్దు చేయాలని భెల్‌ కోరుతోందని తెలుస్తోంది.

    వివరాలు 

    తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్టు

    యాదాద్రి విద్యుత్కేంద్ర నిర్మాణంలో పనుల ఆలస్యం, వ్యయ పెరుగుదల, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వంటి అంశాలు ఎదురవుతున్నా, జూన్ 2025 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోంది.

    అయితే, ఈ ప్రాజెక్టు నిర్దేశిత గడువులో పూర్తవుతుందా? లేక మరింత సమయం పడుతుందా? అనేది చూడాల్సిన విషయం.

    దేశంలోనే అతిపెద్ద విద్యుత్కేంద్రంగా నిలువనున్న ఈ ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్టుగా మారనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యాదాద్రి

    తాజా

    Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. చివరి గంటలో ఊపందుకున్న సూచీలు స్టాక్ మార్కెట్
    Vitamin P: విటమిన్ 'పీ' గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ పోషకపదార్థం సమృద్ధిగా లభించే ఆహారాలివే..! ఆరోగ్యకరమైన ఆహారం
    Tral encounter: భవనంలో జైషే ఉగ్రవాది దాక్కున్న దృశ్యాలను చిత్రీకరించిన డ్రోన్‌ కెమెరా (Video)  జమ్ముకశ్మీర్
    Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం చంద్రబాబు నాయుడు

    యాదాద్రి

    తెలంగాణను వరించిన 5 యాపిల్ అవార్డులు.. యాదాద్రి ఆలయానికి గ్రీన్‌ యాపిల్‌ గుర్తింపు తెలంగాణ
    శాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి.. బాధ్యతలు స్వీకరించిన శ్రీకర్ రెడ్డి అమెరికా
    Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. రికార్డు స్థాయిల,ఎన్ని కోట్లంటే! భారతదేశం
    Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. 25 రోజుల్లో 2.32 కోట్లు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025