NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Yadagirigutta Temple : వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట సిద్ధం.. ఈసారి ప్రత్యేకతలు ఏంటంటే..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Yadagirigutta Temple : వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట సిద్ధం.. ఈసారి ప్రత్యేకతలు ఏంటంటే..
    వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట సిద్ధం

    Yadagirigutta Temple : వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట సిద్ధం.. ఈసారి ప్రత్యేకతలు ఏంటంటే..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 17, 2025
    11:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అయ్యింది.

    ఎల్లుండి నుండి 23 వరకు మహాక్రతువు జరుగనుంది. ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడం పనులు ఇప్పటికే పూర్తయినవి.

    108 మంది రత్వికులు ప్రత్యేక పూజలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.

    దేశంలోని పుణ్య నదుల నుండి పవిత్ర జలాలను తీసుకురానున్నారు. కొండపై ఐదు హోమగుండాలు ఏర్పాటు చేశారు.

    వివరాలు 

    మార్చి 1 నుండి... 

    కొండపై ఉన్న పెద్ద కుండానికి అనుబంధంగా మరో నాలుగు హోమగుండాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

    ప్రతి రోజు శ్రీ సుదర్శన నారసింహ, శ్రీ లక్ష్మి హవన హోమాలు నిర్వహించబడతాయి.

    23న విమాన రాజగోపురానికి 25 కలశాలతో అభిషేకం చేయబడతాయి. 19 నుండి 22 వరకు 108 మంది రత్వికులతో సుదర్శన హోమం, నారసింహ హోమం నిర్వహించబడతాయి.

    23న సుమారు లక్షమందికి పులిహోర ప్రసాదం పంపిణీ చేయబడుతుంది.

    మార్చి 1 నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. వానమామలై రామానుజ జీయర్ స్వామి చేతుల మీదుగా 5 రోజుల ఉత్సవాలు నిర్వహించబడతాయి.

    వివరాలు 

    65.84 కేజీల బంగారం... 

    యాదగిరిగుట్ట విమాన గోపురం కోసం 65.84 కేజీల బంగారాన్ని సమీకరించినట్లు ఆలయ అధికారులు వివరించారు.

    విరాళాల ద్వారా 10.500 కేజీలు, దేవస్థానానికి ఉన్న గోల్డ్ బాండ్ విత్ డ్రా ద్వారా 3 కేజీల 120 గ్రాములు, హుండీలో వచ్చిన ఆభరణాల ద్వారా 12 కేజీల 701 గ్రాములు, వెండిని బంగారంగా మార్చడం ద్వారా 8 కేజీల 672 గ్రాములు, బయట నుంచి 30.51 కేజీల బంగారం కొనుగోలు చేసినట్లు తెలిపారు.

    దివ్య విమాన గోపురం మొత్తం 10,753 స్క్వేర్ ఫీట్ల పరిమాణంలో ఉంది. ఒక్కో స్క్వేర్ ఫీట్‌కు 6 గ్రాములు బంగారం వెచ్చించామని వివరించారు.

    వివరాలు 

    దేశంలోనే అతిపెద్ద గోపురం... 

    ఈ విమాన గోపురం దేశంలోనే అతిపెద్దదిగా పేర్కొంటున్నారు అధికారులు.

    దీనిని 5 అంతస్తుల పంచతల గోపురం అని పిలుస్తారు. 50.5 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గోపురంలో 40 విగ్రహాలను ప్రతిష్టించారు.

    ఒక్కో అంతస్తుకు 8 విగ్రహాలు అమర్చబడ్డాయి. స్వామివారి గోపురం, ఆలయపు 39 కళశాలను కూడా బంగారంతో తాపించారు.

    మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారంలో చూడటానికి నాలుగు ప్రధాన వీధుల్లో ఎల్‌సీడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

    వివరాలు 

    ఆలయ చరిత్ర... 

    యాదగిరిగుట్ట ఆలయ చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు.

    అతని కుమారుడు హాద ఋషి, లేదా హాదర్షి. ఆయన నరసింహ స్వామి భక్తుడిగా పేరొందారు.

    హాద ఋషికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక వచ్చింది. అందుకే ఆయన తపస్సు చేశాడు.

    ఆయన తపస్సుతో స్వామివారు ప్రత్యక్షమై వరం అడగమన్నారు. అప్పుడు హాదర్షి స్వామివారు ఎల్లప్పుడూ ఇక్కడే ఉండాలని కోరారు.

    అంతిమంగా, స్వామివారు హాదర్షికి యాదగిరిగుట్టలో కొలువై ఉండాలని వరం ఇచ్చారు. యాదవుడు అనే ముని ఈ ప్రదేశంలో తపస్సు చేసినందున, ఈ ప్రాంతానికి యాదగిరి అని పేరు వచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యాదాద్రి

    తాజా

    Vijayawada: రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్‌‌కు మహర్దశ.. ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్‌ ఆమోదం విజయవాడ సెంట్రల్
    Kuppam: కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ కుప్పం
    Kuldeep Yadav: చిన్న నాటి స్నేహితురాలు వంశికతో కుల్‌దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక కుల్దీప్ యాదవ్
    Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులపై నిషేధం  డొనాల్డ్ ట్రంప్

    యాదాద్రి

    తెలంగాణను వరించిన 5 యాపిల్ అవార్డులు.. యాదాద్రి ఆలయానికి గ్రీన్‌ యాపిల్‌ గుర్తింపు తెలంగాణ
    శాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి.. బాధ్యతలు స్వీకరించిన శ్రీకర్ రెడ్డి అమెరికా
    Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. రికార్డు స్థాయిల,ఎన్ని కోట్లంటే! భారతదేశం
    Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. 25 రోజుల్లో 2.32 కోట్లు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025