NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్ర‌ప్రదేశ్‌‌లో మరో బస్సు యాత్ర.. నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార యాత్ర 
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్ర‌ప్రదేశ్‌‌లో మరో బస్సు యాత్ర.. నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార యాత్ర 
    ఆంధ్ర‌ప్రదేశ్‌‌లో మరో బస్సు యాత్ర

    ఆంధ్ర‌ప్రదేశ్‌‌లో మరో బస్సు యాత్ర.. నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార యాత్ర 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 26, 2023
    12:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్ర‌ప్రదేశ్‌‌లో మరో బస్సు యాత్రకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార యాత్ర నిర్వహించనుంది.

    నాలుగున్నరేళ్ల సీఎం వైఎస్ జగన్ పాలనలో జరిగిన సామాజిక విప్లవం, సంక్షేమాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా బస్సు కదలనుంది.

    ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈ యాత్ర ప్రారంభం కానుంది. వైనాట్ 175 నినాదంతో అధికార వైసీపీ దూకుడు పెంచుతోంది.

    ప్రజాక్షేత్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 4 కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆ పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్ పేర్కొన్నారు.

    సామాజిక సాధికార యాత్ర ఉత్తరాంధ్రలో ఇవాళ ప్రారంభం కానుంది. ఇచ్ఛాపురం, కోస్తాలోని తెనాలి, రాయలసీమలోని శింగనమల నియోజకవర్గాల్లో యాత్ర మొదలుకానుంది.

    details

    తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఫలితంగా ఏపీలో పొలిటికల్ హీట్

    ఏపీలో రోజుకు 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ డిసెంబరు 31 వరకు మొత్తం 39 నియోజకవర్గాలను టచ్ చేసేలా యాత్రను వైసీపీ అమలు చేస్తోంది.

    మరోవైపు రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

    తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఫలితంగా ఏపీలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగింది. ఇప్పటికే జనసేన వారాహి యాత్రతో ప్రజల్లోకి వెళ్తోంది.

    ఇదే సమయంలో బుధవారం, నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే లోకేష్ ప్రజాక్షేత్రంలోకి వచ్చి యువగళం పాదయాత్ర చేపట్టే అవకాశాలున్నాయి.

    ఈ క్రమంలోనే టీడీపీ, జనసేనకు దీటుగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ సైతం ప్రజల్లోకి వెళ్లేందుకు బస్సు యాత్రకు ముహుర్తం పెట్టింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    నెల్లూరులో హాట్ పాలిటిక్స్.. సోమిరెడ్డి మాటలకు ఇరుకున పడ్డ వైసీపీ నేత ఆదాల తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    యాత్ర-2 మోషన్ పోస్టర్ వచ్చేసింది..'గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' తెలుగు సినిమా
    ఏపీ: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. విశాఖ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా ఆంధ్రప్రదేశ్
    Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే! దిల్లీ ఆర్డినెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025