NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు బైబై.. జగన్‌ను అసెంబ్లీలోనే కలుస్తానని జోస్యం
    తదుపరి వార్తా కథనం
    వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు బైబై.. జగన్‌ను అసెంబ్లీలోనే కలుస్తానని జోస్యం
    జగన్‌ను అసెంబ్లీలోనే కలుస్తానని సవాల్

    వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు బైబై.. జగన్‌ను అసెంబ్లీలోనే కలుస్తానని జోస్యం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 18, 2023
    05:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ మేరకు ఆయా అధిష్టానాలకు షాకులు ఇస్తున్నారు.

    ఈ క్రమంలోనే గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు ప్రతిపక్ష తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

    ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు అపాయింట్‌ అడిగినట్లు యార్లగడ్డ ప్రకటించారు. గన్నవరం అభ్యర్థిగా టిక్కెట్ ఇవ్వాలని భావిస్తే పోటీకి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

    విజయవాడలో తన అనుచరులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో టిడిపి టిక్కెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి కానుకగా ఇస్తానన్నారు. ఈ క్రమంలోనే జగన్‌ను అసెంబ్లీలోనే కలుస్తానని జోస్యం చెప్పారు.

    DETAILS

    అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా, టిక్కెట్ లేదన్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు : యార్లగడ్డ

    గత ఎన్నికల్లో గన్నవరంలో ఓడినా కార్యకర్తలు తనతోనే ఉన్నారని, తనతో ఉన్నవారికి పదవులు ఇవ్వలేదని వైసీపీ మీద గుర్రుగా ఉన్నారన్నారు.

    రెండు రోజుల కిందట సజ్జలను కలిశానన్నారు. టిక్కెట్ అడిగితే ఉండాలనుకుంటే ఉండు లేకుంటే లేదని అన్నట్లు వెంకట్రావు చెప్పారు.

    టిడిపికి కంచుకోట లాంటి గన్నవరంలో వైసీపీ కోసం కష్టపడ్డానన్నారు. తనకు 2005లోనే అమెరికా గ్రీన్ కార్డు వచ్చిందని, రాజకీయాలపై ఆసక్తితోనే తిరిగి గన్నవరం వచ్చానన్నారు.

    టిక్కెట్ కోసం ఇప్పటివరకు చంద్రబాబు, లోకేశ్‌, దేవినేనిని తాను కలవలేదన్నారు. తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని, శాసనసభకు పార్టీ టిక్కెట్ లేదని చెప్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు యార్లగడ్డ చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    ఆంధ్రప్రదేశ్

    బిగ్‌బాస్ షోలో అశ్లీల ప్రసారంపై మండిపడ్డ ఏపీ హైకోర్టు.. సెన్సార్ లేకపోవడంపై ఆగ్రహం  బిగ్ బాస్ తెలుగు
    వైసీపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి.. వినుకొండలో తీవ్ర ఉద్రిక్తత, గాల్లోకి పోలీసుల కాల్పులు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం.. గవర్నర్ సమక్షంలో బాధ్యతల స్వీకరణ భారతదేశం
    హైదరాబాద్‌-విజయవాడ రెగ్యులర్ సర్వీసుల నిలిపివేత.. గుంటూరు మీదుగా దారి మళ్లింపు టీఎస్ఆర్టీసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025