
Yogandhra: యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానికి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఇలా అన్నారు: "అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసింది.
Details
175 దేశాల మద్దతు
యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయి. 175 దేశాల్లో యోగా జరగడం అనేది సాధారణ విషయం కాదు. యోగా అనేది మానవతను పెంపొందించే సామూహిక ప్రక్రియ. గత పదేళ్లలో కోట్లాది మంది జీవితాల్లో యోగా వెలుగులను నింపింది. గ్రామాల నుంచి పట్టణాల వరకు యువత యోగాను అనుసరిస్తోంది. యోగాకు వయసుతో పని లేదు, యోగాకు ఎలాంటి హద్దులూ లేవని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Details
గిన్నిస్ రికార్డులో చోటు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'యోగాంధ్ర-2025' రికార్డు సృష్టించింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా జరిగిన ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. 3 లక్షల మందికిపైగా ప్రజలు పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు. గతంలో సూరత్లో నిర్వహించిన యోగా రికార్డును అధిగమించిన 'యోగాంధ్ర-2025' రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు లక్షలాది మంది ఒకే మార్గంలో యోగాసనాలు ప్రదర్శించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది.