Page Loader
Telangana: రీల్స్ పిచ్చితో రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. గంటపాటు రైళ్లకు అంతరాయం 
రీల్స్ పిచ్చితో రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. గంటపాటు రైళ్లకు అంతరాయం

Telangana: రీల్స్ పిచ్చితో రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. గంటపాటు రైళ్లకు అంతరాయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2025
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

రీల్స్ మోజులో ఓ యువతి రైలు పట్టాలపై కారు నడిపిన ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలోని నాగులపల్లి-శంకర్‌పల్లి మార్గంలో చోటు చేసుకుంది. యువతి ఇలా ప్రవర్తించడంతో రైళ్ల రాకపోకలకు దాదాపు గంటపాటు అంతరాయం ఏర్పడింది. నాగులపల్లి నుంచి శంకర్‌పల్లి దిశగా వెళ్తున్న రైలు ట్రాక్‌పై ఆ యువతి తన కారును నడిపేందుకు ప్రయత్నించింది. ఈ దృశ్యాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి కారును ఆపేందుకు యత్నించారు. అయితే యువతి వారి మాటలు లెక్కచేయకుండానే కారు నడిపిస్తూ ముందుకు వెళ్లిపోయింది.

వివరాలు 

ముందు జాగ్రత్తగా ట్రైన్‌ను ఆపేసిన లోకో పైలట్

ఈ క్రమంలో నాగులపల్లిలో కొంతమంది స్థానికులు ఈ ఘటనను గమనించి, ఆమె కారును అడ్డగించేందుకు ప్రయత్నించారు. అయినా యువతి ఆపకుండానే కారును నడిపిస్తూ వెళ్లడానికి ప్రయత్నించింది. అతికష్టం మీద, స్థానికులు కారును అడ్డగించగలిగారు. అయితే ఆమె వారిని తిడుతూ, బెదిరించే ప్రయత్నం కూడా చేసింది. అప్పటికే అదే ట్రాక్‌లో ఓ రైలు వస్తుండగా, లోకో పైలట్ ముందు జాగ్రత్తగా ట్రైన్‌ను ఆపేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం స్థానికులు తీవ్రంగా శ్రమించి యువతిని కారులో నుంచి బయటకు లాగేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసు శాఖ ఘటన స్థలానికి చేరుకుని, ఆమెను అదుపులోకి తీసుకుంది.

వివరాలు 

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చే రైళ్లను నిలిపేసిన అధికారులు 

యువతి చేసిన ఈ అర్థరహిత చర్య వల్ల అనేక రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చే రైళ్లను అధికారులు నిలిపివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన శంకర్‌పల్లి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇదంతా ఆమె సోషల్ మీడియా రీల్స్ కోసం చేశిందని పోలీసులు భావిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో