
Telangana: రీల్స్ పిచ్చితో రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. గంటపాటు రైళ్లకు అంతరాయం
ఈ వార్తాకథనం ఏంటి
రీల్స్ మోజులో ఓ యువతి రైలు పట్టాలపై కారు నడిపిన ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలోని నాగులపల్లి-శంకర్పల్లి మార్గంలో చోటు చేసుకుంది. యువతి ఇలా ప్రవర్తించడంతో రైళ్ల రాకపోకలకు దాదాపు గంటపాటు అంతరాయం ఏర్పడింది. నాగులపల్లి నుంచి శంకర్పల్లి దిశగా వెళ్తున్న రైలు ట్రాక్పై ఆ యువతి తన కారును నడిపేందుకు ప్రయత్నించింది. ఈ దృశ్యాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి కారును ఆపేందుకు యత్నించారు. అయితే యువతి వారి మాటలు లెక్కచేయకుండానే కారు నడిపిస్తూ ముందుకు వెళ్లిపోయింది.
వివరాలు
ముందు జాగ్రత్తగా ట్రైన్ను ఆపేసిన లోకో పైలట్
ఈ క్రమంలో నాగులపల్లిలో కొంతమంది స్థానికులు ఈ ఘటనను గమనించి, ఆమె కారును అడ్డగించేందుకు ప్రయత్నించారు. అయినా యువతి ఆపకుండానే కారును నడిపిస్తూ వెళ్లడానికి ప్రయత్నించింది. అతికష్టం మీద, స్థానికులు కారును అడ్డగించగలిగారు. అయితే ఆమె వారిని తిడుతూ, బెదిరించే ప్రయత్నం కూడా చేసింది. అప్పటికే అదే ట్రాక్లో ఓ రైలు వస్తుండగా, లోకో పైలట్ ముందు జాగ్రత్తగా ట్రైన్ను ఆపేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం స్థానికులు తీవ్రంగా శ్రమించి యువతిని కారులో నుంచి బయటకు లాగేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసు శాఖ ఘటన స్థలానికి చేరుకుని, ఆమెను అదుపులోకి తీసుకుంది.
వివరాలు
బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చే రైళ్లను నిలిపేసిన అధికారులు
యువతి చేసిన ఈ అర్థరహిత చర్య వల్ల అనేక రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చే రైళ్లను అధికారులు నిలిపివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన శంకర్పల్లి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇదంతా ఆమె సోషల్ మీడియా రీల్స్ కోసం చేశిందని పోలీసులు భావిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
రీల్స్ పిచ్చితో రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. రైళ్ల రాకపోకలకు అంతరాయం.
— Telugu Stride (@TeluguStride) June 26, 2025
రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ వెళ్ళిన యువతి.
రైలు పట్టాలపై కారును గుర్తించి బెంగళూరు- హైదరాబాద్ రైలును ఆపేసిన లోకోపైలట్
యువతిని అదుపులోకి తీసుకున్న… pic.twitter.com/H73x59Yu3j