Page Loader
YS Jagan: సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్‌పై తొందరపాటు చర్యలొద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్‌పై తొందరపాటు చర్యలొద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశం

YS Jagan: సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్‌పై తొందరపాటు చర్యలొద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 27, 2025
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ల గ్రామంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనపై దాఖలైన కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానంలో దాఖలైన క్వాష్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకూడదని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఘటనకు ముందు,పల్నాడు జిల్లాలో జగన్ పర్యటిస్తున్న సమయంలో సింగయ్య మృతి చెందిన నేపథ్యంలో, జగన్ కారణమనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు.

వివరాలు 

జగన్‌తో పాటు ఇతరులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై విచారణ 

బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలవగా, శుక్రవారం నాడు ఈ అంశంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. నిందితులుగా ఉన్న వారు క్వాష్ పిటిషన్లు వేశారు కాబట్టి, వారిపై దూకుడుగా వ్యవహరించవద్దని పోలీసులను హైకోర్టు సూచించింది. ఈ కేసులో వైఎస్ జగన్‌తో పాటు ఆయన వాహన డ్రైవర్ రమణారెడ్డి, వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ ప్రముఖులు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనీ వంటి నాయకులను కూడా నిందితులుగా పోలీసులు చేర్చారు. వీరందరూ తమపై నమోదు అయిన కేసులు రద్దు చేయాలంటూ హైకోర్టులో వేర్వేరుగా క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్లను ఒకటిగా కలిపి హైకోర్టు సమగ్రంగా విచారణ జరుపుతోంది.

వివరాలు 

సింగయ్య మరణానికి జగన్ ప్రచార వాహనం కారణం 

ఇదిలా ఉండగా, సింగయ్య మరణానికి జగన్ ప్రచార వాహనం కారణమైందని స్పష్టంగా చూపించే వీడియో ఆధారాలు ఉన్నాయని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ గతంలో వెల్లడించారు. సంఘటన జరిగిన స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ విజువల్స్, అలాగే స్థానికుల చేతితో తీసిన వీడియోలను పూర్తిగా పరిశీలించిన తరువాతే కేసు నమోదు చేశామని ఆయన వివరించారు.