LOADING...
Fact Check: కిలో అరటిపండ్లు 50 పైసలే? సంచలనంగా వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ 
కిలో అరటిపండ్లు 50 పైసలే? సంచలనంగా వైఎస్‌ జగన్‌ ట్వీట్

Fact Check: కిలో అరటిపండ్లు 50 పైసలే? సంచలనంగా వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్‌ చేసిన ట్వీట్‌లో కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలకు మాత్రమే విక్రయిస్తున్నాయని చెప్పడం పై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్‌ చెక్ చేసింది. ఈ వాదన పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేసింది. ఈ మేరకు జగన్ చేసిన ట్వీట్‌పై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం 'ఎక్స్‌' వేదికగా స్పందిస్తూ వివరణ ఇచ్చింది. అక్టోబర్‌లో సీజన్ ప్రారంభమైన వెంటనే, టన్ను అరిటిని రూ.12,000-14,000 మధ్య విక్రయించారు. నవంబరు మొదటి వారంలో, ఏ గ్రేడ్‌ అరటికి రూ.7,000, బీ గ్రేడ్‌కి రూ.4,000, సీ గ్రేడ్‌కి రూ.3,000 ధరలకు అమ్ముడయ్యాయి. రెండో వారంలో అదే ధరలు కొనసాగాయి. మూడో వారంలో, ఏ గ్రేడ్‌ రూ.8,000, బీ గ్రేడ్‌ రూ.4,000, సీ గ్రేడ్‌ రూ.3,000కి విక్రయమయ్యాయి.

వివరాలు 

అధిక వర్షాల వల్ల సెప్టెంబర్-అక్టోబర్‌లో  కొద్దిగా  పంట నష్టం 

నాల్గో వారంలో, ఏ గ్రేడ్‌ ధర రూ.8,000-10,000, బీ గ్రేడ్‌ రూ.6,000-8,000, సీ గ్రేడ్‌ రూ.4,000-6,000కు పెరిగింది. అనంతపురం, సత్యసాయి, కడప, నంద్యాల జిల్లాల్లో 34,000 హెక్టార్లలో అరటి పంటను సాగించారు. సెప్టెంబర్-అక్టోబర్‌లో అధిక వర్షాల వల్ల పంట కొద్దిగా నష్టం కలిగింది. అయినప్పటికీ, పంట పరిస్థితిని ముందుగా అంచనా వేసి, ట్రేడర్లు, ఎగుమతిదారులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించి తగిన ఆదేశాలు ఇచ్చారు. దిల్లీ ఆంధ్రప్రదేశ్ మార్కెట్‌లో, హరియాణాలోని శీతల గిడ్డంగులలో కూడా సమావేశాలు నిర్వహించి, ఉత్తర భారతదేశం కొనుగోలుదారులు ఆంధ్రప్రదేశ్‌లో పండిన అరటిని కొనుగోలు ప్రారంభించారు. కడప, అనంతపురం జిల్లాల నుంచి 700 మెట్రిక్ టన్నుల అరటిని ఉత్తర భారతదేశానికి పంపి విక్రయించారు.

వివరాలు 

డిసెంబర్ రెండో వారంలో పెరగనున్నఅరటి ధరలు

గత కొన్ని రోజులుగా, మెట్రిక్ టన్నుకు రూ.2,000-4,000 పెరుగుదల రికార్డు అయ్యింది. ప్రభుత్వం అరటి రైతులకు రవాణా రాయితీ ఇవ్వాలని భారతీయ రైల్వేకు సూచించింది. డిసెంబర్ రెండో వారంలో అరటి ధరలు మరింత పెరిగే అవకాశముంది. ఏకంగా, రియల్ పరిస్థితులు రైతుల నిరాశ కలిగించేలా ప్రచారం చేయకుండా, వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జగన్ చేసిన ట్వీట్ 

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం చేసిన ట్వీట్ 

Advertisement