NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pinnelli Ramakrishna Reddy: ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లికి ఊహించని కష్టాలు !
    తదుపరి వార్తా కథనం
    Pinnelli Ramakrishna Reddy: ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లికి ఊహించని కష్టాలు !
    ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లికి ఊహించని కష్టాలు !

    Pinnelli Ramakrishna Reddy: ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లికి ఊహించని కష్టాలు !

    వ్రాసిన వారు Stalin
    May 22, 2024
    09:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విధ్వంసం, అరాచకానికి మారు పేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డంగా దొరికి పోయారు.

    అదీ ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో .. ఈ మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    మే 13న ఎన్నికల రోజు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓ ఈవీఎంను నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు.

    అక్కడున్న వారిని బెదిరించి వెళ్లిపోవడం సీసీటీవీ ఫుటేజీలో చూడవచ్చు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    Details 

    వెబ్ కాస్టింగ్‌తో జరిగిన మేలు : దొరికిపోయిన నేత ! 

    మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పీఎస్‌ నంబర్‌ 202తో పాటు 7 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్ రోజున ఈవీఎంల ధ్వంసం జరిగింది.

    పీఎస్‌ నంబర్‌ 202 లో జరిగిన ఘటనలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెబ్‌ కెమెరాలో రికార్డ్ అయ్యారు.

    ఈవీఎంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేశారు.

    విచారణలో భాగంగా ఈవీఎం పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

    Details 

    నర్సరావు పేట లోక్ సభ స్ధానం పరిధిలో భారీగా విధ్వంసం 

    ఎన్నికల తదనంతం నర్సరావుపేట లోక్ సభ స్ధానం పరిధిలో భారీగా విధ్వంసం జరిగింది.

    దీని పరిధిలోకి మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం వస్తుంది . ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు.

    చాలా చోట్ల ఆస్ధులకు నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ హింసకు స్ధానిక పోలీసులే బాధ్యులనే ఆరోపణలు వచ్చాయి.

    దీనిపై ఎపి డిజిపి నియమించిన సిట్ విచారణ జరిపి సోమవారం ఆయనకు సమర్పించింది. ఇక ఎన్నికల సంఘం ఏ చర్యలకు సిఫార్సు చేస్తుందా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వైరల్ అవుతున్న వీడియో ఇదే.. 

    Macharla YSRCP MLA Pinnelli Ramakrishna Reddy caught on camera damaging EVM

    On May 13th, during the polling process, Macherla MLA and YSR Congress Party (YSRCP) candidate Pinnelli Ramakrishna Reddy broke into a polling booth and destroyed an Electronic Voting Machine (EVM).… pic.twitter.com/3wWa1S3lzw

    — Sudhakar Udumula (@sudhakarudumula) May 21, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికల సంఘం

    తాజా

    ISRO: 18న ఇస్రో 101వ రాకెట్‌ ప్రయోగం: చైర్మన్ వి నారాయణన్ ఇస్రో
    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ

    ఎన్నికల సంఘం

    Lok Sabha Elections 2024: మార్చి 13 తర్వాత లోక్‌సభ ఎన్నికలు  ఎన్నికలు
    ECI: అధికారుల బదిలీలపై రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు లోక్‌సభ
    Lok Sabha Election: ఏప్రిల్ 19న లోక్‌సభ పోలింగ్.. మే 22న ఫలితాలు.. ఎన్నికల సంఘం క్లారిటీ లోక్‌సభ
    ECI: బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఓటర్లకు అవగాహన లోక్‌సభ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025