వర్షాకాలంలో మీ ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి ఆహారాలను తినకూడదో తెలుసుకోండి
నల్ల మబ్బులు, చల్లని వాన, వేడి వేడి ఆహారం.. వర్షాకాలంలో ఈ కాంబినేషన్ భలే గమ్మత్తుగా ఉంటుంది. వర్షాకాలంలో ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ అందమైన ప్రకృతి ఆస్వాదించాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వానలు పడే ఈ సమయంలో కొన్ని ఆహారాలను తినకపోవడం మంచిది. అవి ఏ ఆహారాలో ఇక్కడ తెలుసుకోండి. ఆకు కూరలు: అకు కూరలు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. కానీ వర్షాకాలంలో మాత్రం కాదు. ఈ కాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బాక్టీరియాలు ఆకు కూరలపై పెరుగుతాయి. ఒకవేళ మీరు ఆకు కూరలు తింటే కడుపులో అనేక ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆకు కూరలకు బదులు కాకరకాయ, సొరకాయ తినండి.
జీర్ణ శక్తిని తగ్గించే పెరుగు అసలే వద్దు
సముద్ర ఆహారాలు: చేపలు, రొయ్యలను ఈ కాలంలో తినకూడదు. వర్షపు నీళ్ళలో ఎక్కువగా ఉండటం వలన చేపలు, రొయ్యల్లో బాక్టీరియాలు, శిలీంధ్రాలు పెరుగుతాయి. అందుకే వీటిని పక్కన పెట్టండి. పెరుగు: ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జీర్ణశక్తి తగ్గుతుందని చెబుతారు. దీనివల్ల జీర్ణ సంబంధ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పచ్చి కూరగాయలు: వండని కూరగాయలను ఆస్సలు తినకూడదు. పచ్చి కూరగాయల మీద రోగకారక క్రిములు ఉంటాయి. వాటిని శుభ్రంగా కడిగినా కూడా తినకూడదు. వండిన తర్వాతే తినాలి. ఫ్రై చేసిన ఆహారాలు: వేయించిన ఆహారాలను తీసుకోవడం వల్ల గ్యాస్, మలబద్దకం, అసిడిటీ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా వీటిల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది.