NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Andrapradesh: సైబీరియా నుంచి గుంటూరుకు చేరిన విదేశీ పక్షులు
    తదుపరి వార్తా కథనం
    Andrapradesh: సైబీరియా నుంచి గుంటూరుకు చేరిన విదేశీ పక్షులు
    సైబీరియా నుంచి గుంటూరుకు చేరిన విదేశీ పక్షులు

    Andrapradesh: సైబీరియా నుంచి గుంటూరుకు చేరిన విదేశీ పక్షులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 26, 2024
    11:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల ఆవాస కేంద్రం ఈ సమయంలో విదేశీ పక్షులతో సందడిగా మారింది.

    మధ్య ఆసియా, సైబీరియా, తూర్పు యూరప్ వంటి ప్రాంతాల నుంచి అడవి, వైడర్‌ జాతి పక్షులు ఇక్కడ చేరుకుంటున్నాయి.

    వాటిలో చాలా పక్షులు మంచు గడ్డ కట్టే సమయంలో వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఉప్పలపాడు వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలను ఉత్పత్తి చేస్తాయి.

    1980లో బాపట్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన మృత్యుంజయరావు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు విదేశీ పక్షులను గుర్తించారు.

    ఆయన గ్రామ రైతుల సహకారంతో ఎనిమిది ఎకరాల చెరువును అభివృద్ధి చేశారు. ఈ చెరువులో పక్షులు గుడ్లు పెట్టేందుకు, పిల్లలను ఉత్పత్తి చేయడానికి వీలుగా స్టాండ్లు ఏర్పాటు చేశారు.

    Details

    పక్షుల ఆవాస కేంద్రంగా గుర్తింపు

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న పక్షుల విడిది కేంద్రాలలో, పక్షులు సాధారణంగా ఆరు నెలలకు మించి ఉండవు.

    కానీ ఉప్పలపాడులో అనుకూల వాతావరణం కారణంగా 27 రకాల పక్షులు ఎక్కువ కాలం ఇక్కడే విడిది చేస్తాయి.

    ఈ ప్రత్యేకతతో దీనిని అరుదైన పక్షుల ఆవాస కేంద్రంగా గుర్తించారు. 2002లో అటవీ, పర్యాటక శాఖల సహకారంతో ఈ ప్రాంతంలో టవర్, రైలింగ్‌లు ఏర్పాటు చేశారు.

    ఇక టీడీపీ ప్రభుత్వం రూ. 3 కోట్లు ఖర్చు చేసి ఈ కేంద్రాన్ని విదేశీ పక్షుల విడిది కేంద్రంగా అభివృద్ధి చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుంటూరు జిల్లా
    ఇండియా

    తాజా

    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్

    గుంటూరు జిల్లా

    గుంటూరు: ఇప్పటంలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు; గ్రామస్థుల ఆగ్రహం ఆంధ్రప్రదేశ్
    గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు  ఆంధ్రప్రదేశ్
    గుంటూరు: విట్ యూనివర్సిటీలో విద్యార్థుల డిష్యుం డిష్యుం.. వార్నింగ్ ఇచ్చి పంపిన పోలీసులు విద్యార్థులు
    టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    ఇండియా

    AP Govt: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏపీలో 32 మంది డిప్యూటీ కలెక్టర్ బదిలీ ఆంధ్రప్రదేశ్
    NSE: కొత్త రికార్డును సృష్టించిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా.. రికార్డు స్థాయిలో వృద్ధి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్
    Water Shortage: యమునా నదిలో విషపూరిత నురగలు.. దిల్లీ వాసులకు నీటి కష్టాలు దిల్లీ
    Number plate for vehicles:  ఫ్యాన్స్  నుంచి ఇండియాకి.. వాహనాలకు నంబర్ పేట్ల వ్యవస్థ ఎలా వచ్చిందంటే? ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025