LOADING...
Heath tips : మట్టి సీసాలో నీళ్లు - ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో తెలుసా?
మట్టి సీసాలో నీళ్లు - ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో తెలుసా?

Heath tips : మట్టి సీసాలో నీళ్లు - ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో తెలుసా?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 07, 2026
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీళ్లు నిల్వ చేసే బాటిల్ అంటే సాధారణంగా ప్లాస్టిక్, స్టీల్ లేదా గాజు పాత్రలే మనకు గుర్తుకు వస్తాయి. అయితే, వీటితో పోలిస్తే మట్టితో తయారు చేసిన సీసాల్లో నీటిని ఉంచి తాగడం మరింత ఆరోగ్యకరమని నిపుణులు సూచిస్తున్నారు. మట్టి సీసాల్లో నిల్వ చేసిన నీరు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలను అందిస్తుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో ఈ నీటిని తాగే అలవాటు చేసుకుంటే శరీరానికి చాలా మేలు జరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు మట్టి సీసాల్లోని నీరు ఇచ్చే ప్రయోజనాలను తెలుసుకుందాం.

వివరాలు

అద్భుత మినరల్స్ లభ్యం..

మట్టి సీసాలు పర్యావరణానికి హానికరం కానివి. ప్లాస్టిక్ వల్ల కలిగే సమస్యలను ఇవి తగ్గిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. బంకమట్టి సహజంగానే అనేక రకాల ఖనిజాలతో నిండి ఉంటుంది. ఈ మట్టితో చేసిన పాత్రల్లో నీటిని నిల్వ చేస్తే, ఆ ఖనిజాలు నీటిలో కలిసిపోతాయి. దాంతో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే శరీరానికి అవసరమైన మినరల్స్ లభిస్తాయి. అలాగే సహజ మట్టి పాత్రలు నీటిలో ఉండే మురికి, బాక్టీరియా కాలుష్యాన్ని తగ్గించి నీటి నాణ్యతను మెరుగుపరుస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

వివరాలు

సహజ చల్లదనం, శుద్ధత

వేసవిలో చాలా మంది ఫ్రిజ్‌లో పెట్టిన చల్లని నీటినే తాగుతారు. అయితే అది తాత్కాలికంగా చల్లదనాన్ని ఇచ్చినా, దాహాన్ని పూర్తిగా తీర్చదు. కొంతసేపటికే మళ్లీ దాహం వేయడం సహజం. కానీ మట్టి పాత్రల్లో సూక్ష్మ రంధ్రాలు ఉండటం వల్ల గాలి ప్రసరణ జరుగుతుంది. దీని వలన నీరు సహజంగానే చల్లగా, శుభ్రంగా ఉంటుంది. ఇది శరీరానికి అనుకూలమైన ఉష్ణోగ్రతలో ఉంటుంది. మరోవైపు ప్లాస్టిక్ బాటిళ్లలో హానికరమైన రసాయనాలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మట్టికి నీటిలోని విషపదార్థాలను శోషించే గుణం కూడా ఉందని నిపుణులు వివరిస్తున్నారు.

Advertisement

వివరాలు

హార్మున్ స్థాయిలు పెరుగుదల

ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిని తరచూ తాగడం వల్ల టెస్టోస్టిరోన్ హార్మోన్ స్థాయిలు తగ్గే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కానీ మట్టి పాత్రలు ఉపయోగించడం వల్ల ఈ సమస్యను తగ్గించవచ్చని అంటున్నారు. మట్టిలో సహజంగా ఆల్కలైన్ లక్షణాలు ఉండటం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ప్లాస్టిక్, మట్టి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని పోల్చినప్పుడు, మట్టి పాత్రల్లోని నీరు మరింత శ్రేష్ఠమైన నాణ్యత కలిగి ఉందని పరిశోధనలు వెల్లడించాయి. ముఖ్యంగా, మూడు రోజులపాటు మట్టి పాత్రల్లో నీటిని ఉంచితే ఈ-కోలై బ్యాక్టీరియా సంఖ్య గణనీయంగా తగ్గి దాదాపు లేకుండా పోతుందని కూడా గుర్తించారు.

Advertisement

వివరాలు

బరువు నియంత్రణలో సహాయం

మట్టి సీసాల్లో నిల్వ చేసిన నీటిలో pH స్థాయి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ఇది శరీరంలోని ఆమ్ల-క్షార సమతుల్యతను నిలబెట్టడంలో సహాయపడుతుంది. ఫలితంగా శరీరం తాజాగా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అధిక బరువుతో బాధపడుతున్నవారు ఈ నీటిని తాగడం ద్వారా బరువు నియంత్రణలో కొంతమేరకు సహాయం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం మట్టిపాత్రల్లో వంట చేస్తే ఆహారంలోని పోషకాలు, సహజ రుచి, సువాసన అలాగే నిలిచి ఉంటాయి. మట్టి పాత్రల్లో ఉన్న సూక్ష్మ రంధ్రాలు వేడిని సమానంగా పంచి ప్రతి భాగానికి చేరేలా చేస్తాయి. శాకాహారమో, మాంసాహారమో ఏ వంటకమైనా ఇవి ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాకుండా వంటగదికి సహజమైన అందాన్ని కూడా అందిస్తాయి.

Advertisement