LOADING...
Krishna Janmashtami: కృష్ణ జన్మాష్టమి 2025.. ఈ ఏడాది రెండు రోజులు పండుగ ప్రత్యేకత ఏమిటి?
కృష్ణ జన్మాష్టమి 2025.. ఈ ఏడాది రెండు రోజులు పండుగ ప్రత్యేకత ఏమిటి?

Krishna Janmashtami: కృష్ణ జన్మాష్టమి 2025.. ఈ ఏడాది రెండు రోజులు పండుగ ప్రత్యేకత ఏమిటి?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2025
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినమే కృష్ణ జన్మాష్టమి. ఈ పవిత్ర పర్వదినాన్ని దేశ వ్యాప్తంగా భక్తులు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు ఉపవాసాలు పాటించడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా భక్తులు కృష్ణుని అనుగ్రహం పొందాలనే ఆకాంక్షతో ఉంటారు. ఈ ఏడాది కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఈ పండుగ రెండు రోజులు జరగనుంది. తేదీలు, కారణాలు, పూజా విధానాల వివరాలు ఇలా ఉన్నాయి. 2025 కృష్ణ జన్మాష్టమి తేదీలు ద్రుక్ పంచాంగం ప్రకారం ఈఏడాది జన్మాష్టమి ఆగస్టు 15, 16తేదీల్లో జరుపుకుంటారు. అష్టమి తిథి ఆగస్టు 15రాత్రి 11:49 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 16 రాత్రి 9:34 గంటలకు ముగుస్తుంది. ఈ సంవత్సరం శ్రీకృష్ణుడి 5252వ జయంతి

Details

రెండు రోజులు పండుగ జరగడానికి కారణం

సాధారణంగా జన్మాష్టమి ఒకే రోజు జరుపుకుంటారు. కానీ ఈసారి అష్టమి తిథి అర్ధరాత్రి సమయానికి దగ్గరగా ప్రారంభం కావడంతో పండుగ రెండు రోజులకు విస్తరించింది. దీని వెనుక రెండు ప్రధాన పద్ధతులు ఉన్నాయి 1. తిథి ప్రాధాన్యత - కొంతమంది భక్తులు అష్టమి తిథి ప్రారంభ సమయాన్నే ముఖ్యంగా పరిగణిస్తారు. ఈ ప్రకారం ఆగస్టు 15 రాత్రి నుంచే ఉపవాసాలు, పూజలు మొదలుపెడతారు. 2. నక్షత్ర ప్రాధాన్యత - మరికొందరు రోహిణి నక్షత్ర సమయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ సంవత్సరం రోహిణి నక్షత్రం ఆగస్టు 16న రావడంతో ఆ రోజునే పండుగ నిర్వహిస్తారు. భక్తులు తమ సంప్రదాయం, సౌకర్యాన్ని బట్టి ఏ రోజున జరుపుకోవాలో నిర్ణయించుకుంటారు.

Details

పూజా విధానాలు, సంప్రదాయాలు 

ఉపవాసం-చాలామంది భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. కొందరు నిర్జల ఉపవాసం (నీరు కూడా తాగకుండా) పాటిస్తారు. మరికొందరు పండ్లాహారం మాత్రమే తీసుకుంటారు. అలంకరణలు-ఇళ్లు, దేవాలయాలు పూలతో, దీపాలతో అందంగా అలంకరించబడతాయి. పూజలు-అష్టమి తిథి అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడి జననాన్ని గుర్తుచేసుకుంటూ ప్రత్యేక పూజలు, హారతులు జరుగుతాయి. అనంతరం పాలు, పండ్లు, ఇతర నైవేద్యాలు సమర్పించి, తర్వాత భక్తులు వాటిని స్వీకరిస్తారు. దహీ హండీ-దేశంలోని అనేక ప్రాంతాల్లో దహీ హండీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎత్తైన ప్రదేశంలో వేలాడదీసిన పెరుగు కుండను యువకులు మానవ పిరమిడ్‌ నిర్మించి పగలగొడతారు. ఇది చిన్నతనంలో కృష్ణుడి వెన్నదొంగతనం సరదాను సూచిస్తుంది. కీర్తనలు, భజనలు -కృష్ణుడి కీర్తనలు, భజనలు పాడుతూ భక్తులు పండుగను ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకుంటారు.