Nita Ambani: ర్యాపిడ్ ఫైర్లో ప్రధాని మోదీ, ముకేశ్ అంబానీపై ప్రశ్న.. నీతా అంబానీ ఆసక్తికర సమాధానం
ఈ వార్తాకథనం ఏంటి
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) ర్యాపిడ్ ఫైర్లో అడిగిన ఓ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
ఆమె ఇచ్చిన సమాధానంతో వీక్షకులు ఆనందంతో చిరునవ్వులు చిందించారు.
ఈ వారాంతంలో నీతా అంబానీ హార్వర్డ్ ఇండియన్ కాన్ఫరెన్స్ 2025లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ప్రధానిగా మోదీ (PM Modi) ముకేష్ అంబానీ (Mukesh Ambani) గురించి అడిగినప్పుడు, ''ప్రధాని నరేంద్ర మోదీతో దేశానికి గొప్ప మంచి జరుగుతోంది. నా భర్త ముకేశ్ అంబానీతో మా కుటుంబానికి మంచి జరుగుతోంది'' అని పేర్కొన్నారు.
ఆమె ఇచ్చిన ఈ తెలివైన సమాధానం కాన్ఫరెన్స్లో పాల్గొన్నవారంతా చిరునవ్వులతో అభినందించారు.
వివరాలు
నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం
అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 15, 16 తేదీల్లో జరిగిన ప్రతిష్ఠాత్మక వార్షిక భారత సదస్సులో నీతా అంబానీ కీలకోపన్యాసం చేశారు.
భారత వాణిజ్యం, విధానాలు, సంస్కృతి వంటి అంశాలపై మాట్లాడారు. ఆధునిక ప్రపంచంలో భారత కళలు, సంస్కృతి, వాటి ప్రాముఖ్యతను గురించి గణనీయంగా చర్చించారు.
ఈ సందర్భంలో నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. గ్లోబల్ ఛేంజ్ మేకర్గా తన దాతృత్వం, సామాజిక సేవా కార్యక్రమాలతో నీతా అంబానీ గుర్తింపును పొందారు.
ఈ సందర్భంగా బోస్టన్లో జరిగిన కార్యక్రమంలో మసాచుసెట్స్ రాష్ట్ర గవర్నర్ మౌరా హీలీ ఆమెకు గవర్నర్ ప్రశంసాపత్రాన్ని అందజేశారు.