NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Vijayawada: పాకిస్థాన్‌ పేరుతో మన దేశంలో ఒక కాలనీ.. అది కూడా ఎక్కడ ఉందంటే..?
    తదుపరి వార్తా కథనం
    Vijayawada: పాకిస్థాన్‌ పేరుతో మన దేశంలో ఒక కాలనీ.. అది కూడా ఎక్కడ ఉందంటే..?
    Vijayawada: పాకిస్థాన్‌ పేరుతో మన దేశంలో ఒక కాలనీ.. అది కూడా ఎక్కడ ఉందంటే..?

    Vijayawada: పాకిస్థాన్‌ పేరుతో మన దేశంలో ఒక కాలనీ.. అది కూడా ఎక్కడ ఉందంటే..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 31, 2024
    01:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు రాష్ట్రాల్లో మనం ఊహించని ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం .

    విజయవాడలో ఒక కాలనీకి పాకిస్థాన్ అని పేరు పెట్టారు. ఈ కాలనీకి దాదాపు 40 ఏళ్ల చరిత్ర ఉంది.

    ఈ పేరు ఎందుకు పెట్టారు? ఇక్కడ ఎవరు నివసిస్తున్నారు? పాకిస్థాన్‌తో ఈ ప్రాంతానికి సంబంధం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం..

    వివరాలు 

    చరిత్ర వెనుక కథ 

    1971లో, ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు, భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం జరిగింది.

    ఈ యుద్ధంలో భారతదేశం ఘనవిజయం సాధించి తూర్పు పాకిస్థాన్‌ను (నేటి బంగ్లాదేశ్‌) స్వతంత్ర దేశంగా అవతరింపజేసింది.

    ఆ సమయంలో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారి, శరణార్థులుగా భారతదేశానికి వచ్చారు.

    వారికి ఆశ్రయం కల్పించడానికి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా శిబిరాలు ఏర్పాటు చేసింది.

    ఈ నేపథ్యంలో 1984లో విజయవాడ పాయకాపురం సమీపంలో శరణార్థుల కోసం ఒక కాలనీ నిర్మించబడింది.

    1986 నాటికి ఈ కాలనీ 40 ఇళ్లతో పూర్తయింది. ఆసక్తికరంగా, దానికి పాకిస్థాన్ కాలనీ అని పేరు పెట్టారు.

    వివరాలు 

    పాకిస్థాన్‌ కాలనీలో నివసించేవారు ఎవరు? 

    తూర్పు పాకిస్థాన్‌ శరణార్థుల కోసం ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు.

    కానీ, విజయవాడ వరకు రాకూడిన దూరం వారెవ్వరూ ఎంచుకోలేదు.

    కొన్నిరోజుల పాటు కొందరు కుటుంబాలు ఇక్కడ నివసించినప్పటికీ, పాయకాపురం విజయవాడ శివారుగా ఉండటంతో,తగిన వసతులు లేకపోవడంతో వారు తిరిగి వెళ్లిపోయారు.

    ఈ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది.

    వివరాలు 

    వరదల తర్వాత జీవనం 

    మూడు దశాబ్దాల క్రితం బుడమేరు నది వరదల వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు నీటమునిగినప్పుడు, పాకిస్థాన్ కాలనీ అధిక ఎత్తులో ఉండటంతో, వరద ప్రభావిత కుటుంబాలను ఇక్కడకు తరలించారు.

    వారు అప్పుడు అక్కడ స్థిరపడిపోయి తమ జీవితాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఈ కాలనీలో 58 కుటుంబాలు నివసిస్తున్నాయి.

    వివరాలు 

    పేరు వల్ల ఎదురైన ఇబ్బందులు 

    కాలనీ పేరుగా పాకిస్థాన్ ఉంచడం వలన ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    ఇతర దేశాలకు వీసాలు పొందడంలో, ఉద్యోగాల కోసం అప్లై చేయడంలో ఈ పేరు వారికి ప్రతికూలంగా మారింది.

    చాలా సందర్భాల్లో పేరును చూస్తూనే వారి అభ్యర్థనలను తిరస్కరించారట. దీనితో, కాలనీవాసులు తమ ప్రాంత పేరును భగీరథ కాలనీగా మార్చాలని కోరుతున్నారు.

    ఇలా, ఒక చిన్న కాలనీ పాకిస్థాన్ పేరుతో ప్రారంభమై, దాని చరిత్రలో ఎన్నో మలుపులు తీసుకుంది. ఇప్పుడు ఈ పేరు మార్పు వారి భవిష్యత్తు పట్ల కీలకమైందిగా కనిపిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విజయవాడ సెంట్రల్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    విజయవాడ సెంట్రల్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
    రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్ విద్యుత్
    'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం ఎంపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025