NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / జాతీయ పరాక్రమ దినోత్సవం: నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    జాతీయ పరాక్రమ దినోత్సవం: నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ
    నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి

    జాతీయ పరాక్రమ దినోత్సవం: నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 23, 2023
    12:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జనవరి 23.. స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. నాకు రక్తాన్నివ్వండి, మీకు స్వాంతంత్ర్యాన్ని ఇస్తాను అని ఎలుగెత్తి చాటిన యోధుడు పుట్టిన పవిత్ర దినం.

    1897సంవత్సరంలో జనవరి 23వ తేదీన ఒడిషాలో కటక్ లోజన్మించిన నేతాజీ, బ్రిటీష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టాలని ఆజద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) ని స్థాపించారు.

    1921 నుండి 1941వరకు దాదాపు 11సార్లు జైలు పాలయ్యాడు. దేశభక్తులందరిలో రాజులాంటి వాడు సుభాష్ చంద్రబోస్ అని మహాత్మగాంధీ పిలిచేవారు.

    ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో పాసై, దేశం కోసం పనిచేయడానికి గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాడు. ఆ మహనీయుడిని స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం స్మృతి చిహ్నాన్ని నిర్మించింది.

    సుభాష్ చంద్రబోస్

    అండమాన్ దీవుల్లో నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభించున్న ప్రధాని

    సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని స్మరించుకోవడానికి, 2021 నుండి భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ పరాక్రమ దినోత్సవంగా జరుపుతోంది.

    ఈరోజు ఆయన 126వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ, సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. అలాగే నేతాజీ స్మృతి చిహ్నాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడి చేసారు.

    అండమాన్ నికోబార్ దీవులోని రోజ్ ఐలాండ్ లో ఈ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ మూజియం, కేబుల్ కార్ రోప్ వే, చిల్డ్రన్స్ పార్క్ ఉండనున్నాయని అధికారుల సమాచారం.

    ఈ స్మారక చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, వర్చువల్ గా ప్రారంభించనున్నారు. రోజ్ ఐలాండ్ ద్వీపం పేరును 2018లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా పేరు మార్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప
    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ
    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025