NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / జాతీయ పరాక్రమ దినోత్సవం: నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ
    లైఫ్-స్టైల్

    జాతీయ పరాక్రమ దినోత్సవం: నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ

    జాతీయ పరాక్రమ దినోత్సవం: నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ
    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 23, 2023, 12:38 pm 0 నిమి చదవండి
    జాతీయ పరాక్రమ దినోత్సవం: నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ
    నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి

    జనవరి 23.. స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. నాకు రక్తాన్నివ్వండి, మీకు స్వాంతంత్ర్యాన్ని ఇస్తాను అని ఎలుగెత్తి చాటిన యోధుడు పుట్టిన పవిత్ర దినం. 1897సంవత్సరంలో జనవరి 23వ తేదీన ఒడిషాలో కటక్ లోజన్మించిన నేతాజీ, బ్రిటీష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టాలని ఆజద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) ని స్థాపించారు. 1921 నుండి 1941వరకు దాదాపు 11సార్లు జైలు పాలయ్యాడు. దేశభక్తులందరిలో రాజులాంటి వాడు సుభాష్ చంద్రబోస్ అని మహాత్మగాంధీ పిలిచేవారు. ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో పాసై, దేశం కోసం పనిచేయడానికి గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాడు. ఆ మహనీయుడిని స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం స్మృతి చిహ్నాన్ని నిర్మించింది.

    అండమాన్ దీవుల్లో నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభించున్న ప్రధాని

    సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని స్మరించుకోవడానికి, 2021 నుండి భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ పరాక్రమ దినోత్సవంగా జరుపుతోంది. ఈరోజు ఆయన 126వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ, సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. అలాగే నేతాజీ స్మృతి చిహ్నాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడి చేసారు. అండమాన్ నికోబార్ దీవులోని రోజ్ ఐలాండ్ లో ఈ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ మూజియం, కేబుల్ కార్ రోప్ వే, చిల్డ్రన్స్ పార్క్ ఉండనున్నాయని అధికారుల సమాచారం. ఈ స్మారక చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, వర్చువల్ గా ప్రారంభించనున్నారు. రోజ్ ఐలాండ్ ద్వీపం పేరును 2018లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా పేరు మార్చారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ముఖ్యమైన తేదీలు

    తాజా

    7.5% వడ్డీ లభించే మహిళా సమ్మాన్ పొదుపు పథకం బడ్జెట్ 2023
    భవిష్యత్తులో అంగారక గ్రహంపై 'కాంక్రీట్' లాగా ఉపయోగపడనున్న బంగాళదుంపలు గ్రహం
    ఉద్యోగుల తొలగింపులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఫ్లిప్ కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫ్లిప్ కార్ట్
    రిజర్వేషన్ల కోసం ఆందోళన; యడ్యూరప్ప ఇల్లు, కార్యాలయంపై రాళ్ల దాడి కర్ణాటక

    ముఖ్యమైన తేదీలు

    వరల్డ్ టీబీ డే: క్షయ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, జనాల్లో ఉన్న అపనమ్మకాలు లైఫ్-స్టైల్
    ప్రపంచ వాతావరణ దినోత్సవం 2023: ఎందుకు జరుపుతారు? తెలుసుకోవాల్సిన విషయాలేంటి? లైఫ్-స్టైల్
    అమరవీరుల దినోత్సవం 2023: సంవత్సరంలో రెండుసార్లు జరుపుకునే దీని ప్రత్యేకత మీకు తెలుసా? లైఫ్-స్టైల్
    వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023: టాప్ లో ఫిన్లాండ్, మెరుగుపడ్డ ఇండియా స్థానం లైఫ్-స్టైల్

    లైఫ్-స్టైల్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Lifestyle Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023