LOADING...
Republic Day 2026 : రిపబ్లిక్ డే లాంగ్ వీకెండ్ స్పెషల్.. కుటుంబంతో తప్పక చూడాల్సిన చారిత్రాత్మక ప్రదేశాలు ఇవే!
రిపబ్లిక్ డే లాంగ్ వీకెండ్ స్పెషల్.. కుటుంబంతో తప్పక చూడాల్సిన చారిత్రాత్మక ప్రదేశాలు ఇవే!

Republic Day 2026 : రిపబ్లిక్ డే లాంగ్ వీకెండ్ స్పెషల్.. కుటుంబంతో తప్పక చూడాల్సిన చారిత్రాత్మక ప్రదేశాలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 23, 2026
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో భారత్ సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు దేశమంతా దేశభక్తి భావాలతో మారుమోగుతుంది. స్వాతంత్య్రానికి పూర్వం నాటి అనేక చారిత్రక, వారసత్వ ప్రదేశాలు భారతదేశంలో ఇప్పటికీ సజీవంగా నిలిచాయి. రిపబ్లిక్ డే సందర్భంగా కుటుంబంతో లేదా స్నేహితులతో ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే, దేశభక్తిని రగిలించే కొన్ని ఐకానిక్ ప్రదేశాలను సందర్శించవచ్చు. అవేంటి? వాటి ప్రాముఖ్యత ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

Details

రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ - ఢిల్లీ

గణతంత్ర దినోత్సవ వేడుకలకు దిల్లీ దేశంలోనే అత్యంత ప్రధాన కేంద్రం. ప్రతేడాది ఇక్కడ రాజ్‌పథ్‌పై (కర్తవ్య పథ్) ఘనంగా గ్రాండ్ పరేడ్ నిర్వహిస్తారు. కవాతుతో పాటు ఎర్రకోట, ఇండియా గేట్ భారతదేశ దేశభక్తికి ప్రతీకలుగా నిలుస్తాయి. మొఘల్ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ అయిన ఎర్రకోట వద్ద ప్రతి ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేస్తారు.

Details

జాతీయ యుద్ధ స్మారక చిహ్నం

ఇండియా గేట్ సమీపంలో ఉన్న జాతీయ యుద్ధ స్మారక చిహ్నం దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు అంకితం. 2019 ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఈ స్మారకంలో దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల పేర్లు చెక్కబడి ఉన్నాయి. ఇది దేశభక్తి స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది. జనవరి 26న కుటుంబంతో కలిసి సందర్శించదగిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఇది ఒకటి.

Advertisement

Details

జలియన్ వాలాబాగ్

1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోత భారత స్వాతంత్య్ర పోరాటంలో ఓ చీకటి అధ్యాయం. ఈ ఘటనకు స్మారకంగా నిలిచిన జలియన్ వాలాబాగ్ స్వాతంత్య్ర సంగ్రామానికి కీలక గుర్తుగా పరిగణిస్తారు. ఇక్కడ అమరవీరుల జ్ఞాపకాలు నేటికీ బ్రిటిష్ పాలన దురాగతాలను గుర్తు చేస్తాయి. గణతంత్ర దినోత్సవ ట్రిప్‌లో భాగంగా ఇక్కడికి వెళ్లవచ్చు. చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ జనవరి 26న ప్రయాగ్‌రాజ్‌లో ఉంటే చంద్రశేఖర్ ఆజాద్ పార్క్‌ను సందర్శించవచ్చు. గతంలో ఆల్ఫ్రెడ్ పార్క్‌గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశంలోనే 1931 ఫిబ్రవరి 27న స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందాడు. ఈ పార్క్ ఇప్పటికీ దేశభక్తిని ప్రేరేపిస్తుంది.

Advertisement

Details

ఝాన్సీ కోట

ట్రిప్‌లో భాగంగా ఝాన్సీ కోటను కూడా సందర్శించవచ్చు. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట రాణి లక్ష్మీబాయి వీరత్వానికి, ధైర్యసాహసాలకు చిరస్మరణీయ చిహ్నం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాలకు ఇది సాక్ష్యంగా నిలుస్తుంది. నేటికీ ఈ కోట త్యాగం, ధైర్య గాథలను చెబుతుంది. కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నాన్ని కూడా సందర్శించవచ్చు. కార్గిల్ యుద్ధం అనంతరం భారత సైన్యం నిర్మించిన ఈ స్మారకంలో అమరవీరుల పేర్లు చెక్కబడి ఉన్నాయి. యుద్ధానికి సంబంధించిన ఫోటోలు, సంఘటనలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి.

Details

వాఘా సరిహద్దు

జనవరి 26న భారత-పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న వాఘా బోర్డర్‌ను విజిట్ చేయవచ్చు. ఇక్కడ జరిగే సరిహద్దు వేడుకలు దేశభక్తి ఉత్సాహాన్ని ఉరకలెత్తిస్తాయి. గణతంత్ర దినోత్సవం నాడు ఇక్కడ ప్రత్యేకంగా దేశభక్తి వాతావరణం కనిపిస్తుంది. రిపబ్లిక్ డే స్పెషల్ లాంగ్ వీకెండ్‌లో పిల్లలు, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి వెళ్లి చూడటానికి ఈ చారిత్రాత్మక ప్రదేశాలు ఎంతో అనువైనవి. దేశ చరిత్రను దగ్గర నుంచి అనుభూతి చెందేందుకు ఇవి అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాయి.

Advertisement