NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ఇండియాలోని రిచ్ గ్రామాలు: పేరుకు పల్లెలు, ఆస్తులు మాత్రం వేల కోట్లు 
    తదుపరి వార్తా కథనం
    ఇండియాలోని రిచ్ గ్రామాలు: పేరుకు పల్లెలు, ఆస్తులు మాత్రం వేల కోట్లు 
    గుజరాత్ లోని మాదాపూర్ గ్రామం

    ఇండియాలోని రిచ్ గ్రామాలు: పేరుకు పల్లెలు, ఆస్తులు మాత్రం వేల కోట్లు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 24, 2023
    05:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పల్లెటూరు గురించి తక్కువగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు చెప్పబోయే రిచ్ గ్రామాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. సిటీని తలదన్నే ఇండ్లు, సంపాదన ఉన్న పల్లెల గురించి తెలుసుకుందాం.

    మాధాపూర్- గుజరాత్

    గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఉండే ఈ గ్రామంలో 8వేల కుటుంబాలున్నాయి. ఇక్కడ అన్ని నేషనల్ బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకుల్లో 8వేల కోట్లకు పైగా డబ్బులున్నాయట.

    ఈ ప్రాంతంలోని రైతులు, మామిడి, ఖర్జూరం ఎక్కువగా పండిస్తారు. 1960నుండి ఇక్కడి రైతులు వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేస్తూ డబ్బులు సంపాదస్తున్నారు.

    ఇక్కడ పండిన ఉత్పత్తులను ముంబైకి ఎగుమతి చేసి డబ్బు సంపాదిస్తారు. సిటీలో ఉండే అన్ని సౌకర్యాలు ఈ ఊరిలో ఉన్నాయి.

    Details

    అంకాపూర్-తెలంగాణ 

    నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామంలో, సాధారణ గ్రామంలా ఉండదు. మహానగరంలోని అతిసుందరమైన కాలనీలా అనిపిస్తుంది. ఈ పల్లెలో ఎక్కువమంది వ్యవసాయం చేస్తుంటారు.

    కూరగాయలు, పసుపు పంటను ఎక్కువగా పండిస్తారు. విత్తనాలను పండించడం మొదలెట్టిన దగ్గరి నుండి అంకాపూర్ చరిత్ర మారిపోయింది.

    ఇక్కడి రైతులు పొలాలకు వెళ్ళడానికి కార్లనే ఉపయోగిస్తారు. కూలీలను కూడా కార్లలోనే తీసుకెళ్తారంటే ఈ పల్లె ఎంత రిచ్చో అర్థం చేసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే, అంకాపూర్ దేశి చికెన్ చాలా ఫేమస్.

    Details

    సఖినేటి పల్లి, మలికిపురం - ఆంధ్రప్రదేశ్ 

    డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సఖినేటి పల్లి, మలికిపురం మండలాల ప్రజలు ఎక్కువగా విదేశాలకు వెళ్తుంటారు. ఒకప్పుడు గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళు, ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా, ఇంగ్లండ్ దేశాల్లో పనిచేయడానికి వెళ్తున్నారు.

    ఈ మండలాల్లోని గ్రామాలు ధనిక గ్రామాలుగా మారడానికి ముఖ్య కారణం, ఇతర దేశాల నుండి వచ్చిన డబ్బే. ఈ మండలాల్లోని ఏ గ్రామానికీ వెళ్ళినా అబ్బురపరిచే ఇండ్లు కనిపిస్తాయి.

    అసలే కోనసీమ, అందులో అందమైన ఇండ్లతో ఈ రెండు మండలాలు మెరిసిపోతుంటాయి.

    ఈ రెండు మండలాల నుండి రోజుకు కనీసం పదికి పైగా బస్సులు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుకు బయలుదేరతాయి. అంటే, విదేశాల నుండి వచ్చిపోయేవాళ్ళు ఎంతమంది ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    S-400 missile systems: 2026 నాటికి భారతదేశానికి మిగిలిన S-400 క్షిపణి వ్యవస్థలు  రష్యా
    Canada: భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులకి దూరంగా ఉండండి: కెనడా మాజీ ప్రధాని  కెనడా
    Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు! బంగారం
    Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో యువ నటుడు మృతి బాలీవుడ్

    జీవనశైలి

    మీ ఆహారంలో బీన్స్ తీసుకుంటున్నారా? బీన్స్ చేసే మేలు తెలుసుకోండి  లైఫ్-స్టైల్
    నవారు మంచం లక్ష రూపాయలు; భారతీయ వస్తువుకు అమెరికాలో అదిరిపోయే రేటు  లైఫ్-స్టైల్
    ఈగలు ఇబ్బంది పెడుతున్నాయా? వాటిని తరిమి కొట్టడానికి పాటించాల్సిన ఇంటి చిట్కాలు  గృహం
    అంతర్జాతీయ ఎం.పీ.ఎస్ అవగాహన దినోత్సవం: రకాలు, లక్షణాలు, చికిత్స  లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025