Satgarh Fort: మధ్యప్రదేశ్లోని సత్గఢ్ కోట.. మునిగిపోయిన చారిత్రక సంపద
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఖాన్పుర్ గ్రామం ఒకప్పుడు 100కి పైగా కుటుంబాలు నివసించే, పంట భూములతో పరిపూర్ణంగా ఉన్న గ్రామంగా ఉండేది. సమీపంలోనే కడాన్ నది ఒడ్డున విస్తరించి ఉన్న శతాబ్దాల చరిత్ర కలిగిన సత్గఢ్ కోట, రాజకీయం, సంపన్నతకి ప్రతీకగా వెలుగొందేది. ఆ ప్రాంతంలో రాతి చిత్రాలు, వృక్షాల ద్వారా ఏర్పడిన వారసత్వ సంపద, చారిత్రక గుర్తింపుగా నిలిచేవి. కానీ ఇప్పుడు ఆ ప్రాచీన సంపదలు అన్ని నీటమునిగిపోయాయి. దీనికి కారణం సమీపంలో నిర్మించిన సత్గఢ్ కడాన్ ప్రాజెక్ట్.
వివరాలు
నీటి పై భాగంలో కోట పైభాగం
సత్గఢ్ కోటను భారత పురావస్తు సర్వే (ASI) పరిరక్షణలో ఉంచింది. స్థానికుల కథనాల ప్రకారం, ఈ కోటను దాంగీ రాజవంశీయులు నిర్మించారట. విహారం కోసం రాణి ఇక్కడికి వస్తుంటుందని, ఇక్కడి కోట నుంచి గఢ్పహరా కోట వరకు ఒక సొరంగం కూడా ఉందని వారు చెబుతారు. 2016 నుంచి 2018 వరకు సత్గఢ్ కడాన్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. ముంపు ప్రాంతాల కారణంగా ఖాన్పుర్ గ్రామంలోని ప్రతి ప్రాచీన నిర్మాణం నీటమునిగిపోయింది. అప్పటికే ఖాన్పుర్ గ్రామాన్ని ఖాళీ చేయడం జరిగింది. స్థానికులు కోటను రక్షించడానికి కృషి చేసినప్పటికీ, ఫలితం రాలేదు. ప్రస్తుతం కోట పైభాగం మాత్రమే నీటి పై భాగంలో కనబడుతోంది.