NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ఏటా సెప్టెంబర్ 5నే ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    ఏటా సెప్టెంబర్ 5నే ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారో తెలుసా
    ఏటా సెప్టెంబర్ 5నే ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారో తెలుసా

    ఏటా సెప్టెంబర్ 5నే ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 04, 2023
    06:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏటా సెప్టెంబర్ 5న భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని స్మరించుకుంటూ ప్రతీ సంవత్సరం దేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ.

    సుప్రసిద్ధ పండితుడు, ఉపాధ్యాయుడు, విద్యావేత్త అయిన సర్వేపల్లి పుట్టినరోజునే ఏటా సెప్టెంబర్ 5న టీచర్స్ డేగా జరుపుకుంటారు.

    1962 సెప్టెంబరు 5న తొలిసారిగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నారు. డా. రాధాకృష్ణన్‌ను చాలా మంది విద్యార్థులు ఆరాధించేవారు. 1962లో ఆయన రాష్ట్రపతి అయ్యాక సెప్టెంబర్ 5ను రాధాకృష్ణన్ డేగా జరుపుకోవాలని కోరారు.

    ఈ మేరకు సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటేనే తనకు గర్వకారణమని సర్వేపల్లి బదులిచ్చారు. అలా మొదటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని భారతదేశంలో 1962 సెప్టెంబర్ 5న జరుపుకోవడం గమనార్హం.

    DETAILS

    భారతరత్నతో పాటు నైట్‌హుడ్ అందుకున్న సర్వేపల్లి 

    తమిళనాడులోని తిరుత్తణిలోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో సెప్టెంబర్ 5, 1882న సర్వేపల్లి జన్మించారు. ఈ మేరకు భారత మొదటి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతిగా కీర్తి గడించారు.

    ఆయన MA, D.Litt, LL.D., DCL, Litt.D., DL, FRSL, FBA, లాంటి ఎన్నో డిగ్రీలను సాధించాడు. ఎన్నో పుస్తకాలను రచించిన సర్వేపల్లి, 1918లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఫిలాసఫీ పేరుతో సాహిత్య రచనలను పూర్తి చేశారు.

    ఆంధ్రా యూనివర్సిటీతో పాటు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (1939-48) వైస్-ఛాన్సలర్‌గా విధులు నిర్వర్తించారు. విద్యవ్యాప్తికి ఆయన చేసిన కృషికి 1931లో భారతరత్నతో పాటు నైట్‌హుడ్ లభించింది.

    27 సార్లు నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. స్వాతంత్రం తర్వాత UNESCO (1946-52)లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముఖ్యమైన తేదీలు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ముఖ్యమైన తేదీలు

    ప్రపంచ సైకిల్ దినోత్సవం: సైక్లింగ్ ని మీ డైలీ రొటీన్ లో చేర్చుకుంటే కలిగే లాభాలు  జీవనశైలి
    ప్రపంచ పర్యావరణ దినోత్సవం: మారుతున్న పర్యావరణం వల్ల ముంచుకొస్తున్న ముప్పు ఏంటో తెలుసా?  లైఫ్-స్టైల్
    గ్లోబల్ రన్నింగ్ డే: శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచే పరుగు వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు  వ్యాయామం
    ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ఎందుకు జరుపుతారు? తెలుసుకోవాల్సిన విషయాలేంటి?  లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025