Page Loader
Motivational story: పాదరక్షల ఘనత ముందు కిరీటమే తలవంచింది.. ఈ కథ అందరికి అవసరం!
పాదరక్షల ఘనత ముందు కిరీటమే తలవంచింది.. ఈ కథ అందరికి అవసరం!

Motivational story: పాదరక్షల ఘనత ముందు కిరీటమే తలవంచింది.. ఈ కథ అందరికి అవసరం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 29, 2025
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన పురాణాల్లో ఎన్నో నీతి కథలు లభిస్తాయి. ఇవి మనిషి జీవితం ఎలా ఉండాలో, ఇతరులతో ఎలా ప్రవర్తించాలో స్పష్టంగా చెబుతుంటాయి. అహంకారం, గర్వం ఎంతవరకే మనిషిని నడిపిస్తాయో.. చివరికి వాటే ఎలా కూలిపోతాయో చెప్పే ఓ శక్తివంతమైన పురాణకథను ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది వ్యక్తులు తమకు ఉన్న డబ్బు, హోదా, పేరు వల్ల గర్వంతో విర్రవీగుతుంటారు. తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తక్కువ చేసి చూస్తారు, అపహాస్యం చేస్తారు. కానీ కాలం మారుతుంది. ఎదుటివారి గొప్పతనం వెలుగులోకి రాబోతుంది. ఇదే నిజాన్ని తెలియజేసే కథ ఇది. ఒకరోజు విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటం, ఆయన ధరించిన చెప్పులను హేళన చేస్తూ ఇలా అంటుంది.

Details

నీకెలా విలువ ఉంటుందని హేళన

నువ్వు ఎప్పుడూ పాదాల దగ్గరే ఉంటావు. నేనైతే తలపై రాజుగా వెలిగిపోతున్నాను. అందరూ నన్నే చూస్తున్నారు. నీకెలా విలువ ఉంటుందని హేళన చేస్తుంది. అంతకే బాధపడిన చెప్పులు తమ దుస్థితిపై విచారిస్తాయి. కానీ విష్ణుమూర్తి మధురంగా ఓ మాట ఇస్తాడు. పాదరక్షలారా, మీరు చింతించవద్దు. నేను రామావతారం తీసుకున్న తరువాత, మిమ్మల్ని సింహాసనంపై ఉంచే రోజు వస్తుంది. ఆ మాటలే నిజమవుతాయి. రామాయణ కాలంలో రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు, ఆయన సోదరుడు భరతుడు రాజ్యం పాలించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అన్నవెనక భక్తితో, భరతుడు రాముని పాదరక్షలను సింహాసనంపై పెట్టి వాటి ద్వారానే పాలన చేస్తాడు. ప్రతిరోజూ వాటిని నమస్కరిస్తూ పాలన సాగిస్తాడు.

Details

ఈ కథలోని నీతి

ఆ సమయంలో, భరతుడి తలపై ఉన్న కిరీటం - అదే ముందు చెప్పులను హేళన చేసిన కిరీటం - సిగ్గుతో తలవంచుతుంది. ఆ చెప్పులకు ఈ స్థానం వస్తుందని ఊహించలేకపోయానని బాధపడుతుంది. ఎవ్వరినీ హోదా, స్థితి ఆధారంగా తక్కువ చేయకూడదు. కాలం ఎప్పుడైనా మారుతుంది. శ్రమ, వినయం, భక్తి ఉన్నవారికి తప్పక గౌరవం లభిస్తుంది. సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కరిది నిజమైన మహత్తుగా వెలుగుతుంది.