NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / IRCTC Tirupati Tour: తిరుమల శ్రీవారి దర్శనం ఇక సులభం.. IRCTC ప్రత్యేక టూర్ డీటైల్స్!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IRCTC Tirupati Tour: తిరుమల శ్రీవారి దర్శనం ఇక సులభం.. IRCTC ప్రత్యేక టూర్ డీటైల్స్!
    తిరుమల శ్రీవారి దర్శనం ఇక సులభం.. IRCTC ప్రత్యేక టూర్ డీటైల్స్!

    IRCTC Tirupati Tour: తిరుమల శ్రీవారి దర్శనం ఇక సులభం.. IRCTC ప్రత్యేక టూర్ డీటైల్స్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 24, 2025
    01:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వేసవి సెలవుల సందర్భంగా చాలా మంది ఆధ్యాత్మిక ప్రాంతాలతో పాటు వివిధ ప్రదేశాలకు విహరించేందుకు ఆసక్తి చూపుతారు.

    ఈ నేపథ్యంలోని ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

    హైదరాబాద్ నగర వాసుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఆధ్యాత్మిక టూర్ ద్వారా తిరుపతి, తిరుచానూరు, శ్రీకాళహస్తిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది.

    రైలు ద్వారా ప్రయాణించే ఈ ప్యాకేజీ పేరు "తిరుపతి బై వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్". మొత్తం మూడు రాత్రులు, నాలుగు పగళ్ళు కొనసాగే ఈ టూర్ ద్వారా భక్తులు ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు లేకుండానే తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చు.

    Details

    తిరుపతి బై వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ టూర్ వివరాలు

    "తిరుపతి బై వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్" పేరిట ఐఆర్సీటీసీ టూరిజం ఈ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

    ఈ టూర్ నాలుగు రోజులపాటు సాగుతుంది, ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలి.

    టూర్ షెడ్యూల్

    మొదటి రోజు

    రాత్రి 8:05 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 12797) బయల్దేరుతుంది. భక్తులు రాత్రంతా ప్రయాణిస్తారు.

    రెండో రోజు

    ఉదయం 07:05 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నాక, హోటల్‌కి వెళ్లి చెకిన్ చేయాలి. ఫ్రెషప్ అయిన తర్వాత తిరుచానూరు పద్మావతి ఆలయాన్ని దర్శించుకోవాలి.

    అక్కడ అమ్మవారిని దర్శించుకున్నాక, శ్రీకాళహస్తి ఆలయానికి ప్రయాణం. శ్రీకాళహస్తి స్వామిని దర్శించుకున్నాక తిరిగి తిరుపతికి వచ్చి హోటల్‌లో బస చేయాలి.

    Details

    మూడో రోజు

    తెల్లవారుజామునే హోటల్ నుండి బయల్దేరి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలి. ఉచిత దర్శనం అనంతరం తిరిగి తిరుపతిలోని హోటల్‌కు చేరుకోవాలి.

    సాయంత్రం

    హోటల్ చెకౌట్ చేసి తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. 06:35 గంటలకు బయల్దేరే ట్రైన్ (12798) ద్వారా తిరిగి హైదరాబాద్ ప్రయాణం.

    నాలుగో రోజు

    ఉదయం 06:20 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. దీంతో తిరుపతి టూర్ ముగుస్తుంది.

    Details

     టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు

    కంఫర్ట్ క్లాస్ (3AC)

    సింగిల్ షేరింగ్ - రూ. 13,810

    డబుల్ షేరింగ్ - రూ. 10,720

    ట్రిపుల్ షేరింగ్ - రూ. 8,940

    5-11 ఏళ్ల పిల్లలకు (విత్ బెడ్) - రూ. 6,480

    5-11 ఏళ్ల పిల్లలకు (విత్ అవుట్ బెడ్) - రూ. 5,420

    స్టాండర్డ్ క్లాస్ (SL)

    సింగిల్ షేరింగ్ - రూ. 12,030

    డబుల్ షేరింగ్ - రూ. 8,940

    ట్రిపుల్ షేరింగ్ - రూ. 7,170

    5-11 ఏళ్ల పిల్లలకు (విత్ బెడ్) - రూ. 4,710

    5-11 ఏళ్ల పిల్లలకు (విత్ అవుట్ బెడ్) - రూ. 3,650

    Details

    వివరాలు కోసం సంప్రదించాల్సిన నెంబర్లు ఇవే

    ఈ టూర్ ద్వారా ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు.

    ప్రస్తుతం ఈ టూర్ మార్చి 29వ తేదీన ప్రారంభమవుతోంది. మ

    రిన్ని వివరాలకు IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 9701360701 / 9281030712 నెంబర్లను సంప్రదించవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి
    తిరుమల తిరుపతి దేవస్థానం

    తాజా

    Harvard University: మరోసారి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి మరో 450 మిలియన్‌ గ్రాంట్ల కోత అమెరికా
    Stock Market: సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు..  స్టాక్ మార్కెట్
    Mohammed Shami : టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌.. మండిపడ్డ మహ్మద్‌ షమీ..! మహ్మద్ షమీ
    UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకం  ద్రౌపది ముర్ము

    తిరుమల తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం టెక్నాలజీ
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుపతి
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి తిరుపతి

    తిరుమల తిరుపతి దేవస్థానం

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి భూమన కరుణాకర్‌ రెడ్డి
    Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి  తిరుమల తిరుపతి
    తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025