NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Dasara Navaratri 2023: నేడు ఇద్దరమ్మల దివ్యదర్శనం.. మహిషాసుర మర్దిని, శ్రీరాజరాజేశ్వరీ దేవిగా పూజలు
    తదుపరి వార్తా కథనం
    Dasara Navaratri 2023: నేడు ఇద్దరమ్మల దివ్యదర్శనం.. మహిషాసుర మర్దిని, శ్రీరాజరాజేశ్వరీ దేవిగా పూజలు
    మహిషాసుర మర్దిని, శ్రీరాజరాజేశ్వరీ దేవిగా పూజలు

    Dasara Navaratri 2023: నేడు ఇద్దరమ్మల దివ్యదర్శనం.. మహిషాసుర మర్దిని, శ్రీరాజరాజేశ్వరీ దేవిగా పూజలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 23, 2023
    10:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో దేవి శరన్నవరాత్రులు అత్యంత భక్తిశ్రజద్ధలతో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు నవమి, విజయదశమి రెండు రానున్నాయి.

    ఇందులో భాగంగానే అమ్మవారు రెండు అవతారాల్లో దర్శనం ఇస్తున్నారు. ఉదయం మహిషాసురమర్దిని దేవిగా, మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.

    దసరా నవరాత్రి 2023 చివరి రోజున అమ్మవారు రెండు అలంకారాలలో కనువిందు చేయనున్నారు.

    నవమి తిథి ఉదయం వరకు మాత్రమే ఉండటం, మధ్యాహ్నం దశమి తిథి ప్రారంభం అవుతుండటంతో ఇవాళ అమ్మవారు రెండు అవతారాల్లో దర్శన భాగ్యం ఇస్తున్నారు.

    శరన్నవరాత్రుల్లో చివరి అలంకారంగా శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారం నిలవనుంది. బంగారు రంగుర చీరలో దర్శనం ఇవ్వనున్నారు. ఇచ్ఛా, ఙ్ఞాన, క్రియ శక్తులను అమ్మవారు భక్తులకు వరంగా ప్రసాదిస్తుంది.

    details

    జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయి

    క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్యాలను భక్తకోటికి అందించనున్నారు. ఇవాళ నవమి, దశమి సందర్భంగా అమ్మవారిని పూజించి లలితా సహస్ర నామ పారాయణ చేస్తే శ్రేయస్కారం.

    కుంకుమార్చనలు,సువాసినీ పూజలు చేసినా మంచి ఫలితాలు లభిస్తున్నాయి. లడ్డూ ప్రసాదాలను అమ్మవారికి నివైద్యంగా అర్పిస్తారు.

    శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్‌, అష్టోత్తర శతనామావళి పఠించాలి.శ్రీదేవి దండకంతో శరన్నవరాత్రులు ముగియనున్నాయి.

    విజయదశమి రోజున సాయంత్రం నక్షత్ర దర్శనం(శ్రవణ) సమయంలో జమ్మిచెట్టు వద్ద అపరాజితాదేవిగా పూజిస్తారు.

    శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ! అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ!! శ్లోకాన్ని పఠించాలి.

    ఇందులో భాగంగానే జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మకు తగిలిస్తారు. దీంతో అమ్మవారి దయతో తమ కోరికలు నెరవేరుతాయని భక్తజనం నమ్మకం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దసరా నవరాత్రి 2023

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    దసరా నవరాత్రి 2023

    Dasara Navaratri 2023: భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలను జరుపుకునే విధానాలు  లైఫ్-స్టైల్
    ప్రతిష్టాత్మక కోల్​కతా ట్రామ్​కు 150 ఏళ్లు.. దుర్గా పూజా విశేషాలతో ప్రత్యేక అలంకరణ కోల్‌కతా
    దేవి నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు..రోజూ 1.70 లక్షల మందికి దుర్గమ్మ దర్శనం విజయవాడ కనకదుర్గ గుడి
    దసరా నవరాత్రి 2023: దసరా నవరాత్రుల సమయంలో మీ పిల్లల్లో క్రియేటివిటీని పెంచే ఫన్ యాక్టివిటీస్  దసరా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025