వైరల్ వీడియో: రోడ్డు మీద కూర్చుని నీళ్ళు తాగుతున్న పులి, సైలెంట్ గా చూస్తున్న వాహనదారులు
ఉత్తరప్రదేశ్ లోని కటార్నియా ఘాట్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్ర పరిధిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అడవిలో తిరుగుతున్న పులి, సడెన్ గా రోడ్డు మీదకు వచ్చి, వాహనాదారులను షాక్ కు గురి చేసింది. రోడ్డు మీద కూర్చున్న పులి, రోడ్డు పక్కనున్న చిన్న గుంతలో నీళ్ళు తాగుతూ ఉంది. పులిని డిస్టర్బ్ చేయకుండా అటువైపు వాహనదారులు, ఇటువైపు వాహనదారులు సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో, ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. పర్వీన్ కాస్వాన్ అనే అటవీ అధికారి, తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ పోస్టును పెట్టాడు. ఇప్పటివరకు 40వేలమందికి పైగా ఈ వీడియోను చూసారు. చాలామంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు.