NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Cyber crimes: ప్రతిసెకనుకు 11 దాడులు.. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న ముప్పు!
    తదుపరి వార్తా కథనం
    Cyber crimes: ప్రతిసెకనుకు 11 దాడులు.. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న ముప్పు!
    ప్రతిసెకనుకు 11 దాడులు.. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న ముప్పు!

    Cyber crimes: ప్రతిసెకనుకు 11 దాడులు.. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న ముప్పు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 11, 2024
    09:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారంగా రూపొందిస్తున్న మాల్‌వేర్‌ల కారణంగా రాబోయే కాలంలో సైబర్‌ ముప్పులు మరింత పెరగనున్నాయి.

    ఈ మేరకు డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీఎస్‌సీఐ), సెక్‌రైట్‌ సంస్థలు తాజాగా విడుదల చేసిన 'ఇండియా సైబర్‌ థ్రెట్‌ రిపోర్ట్‌-2025' వెల్లడించింది.

    ఏఐనే ఉపయోగించి ఈ ముప్పులను నియంత్రించే మార్గాలూ ఉన్నాయని ఈ నివేదిక సూచిస్తుంది. గతేడాది కాలంలో ప్రతి సెకనుకు 11 సైబర్‌ దాడులు చోటుచేసుకున్నట్లు నివేదికలో తేలింది.

    దేశవ్యాప్తంగా 84 లక్షల ఎండ్‌పాయింట్లలో గుర్తించిన దాడుల్లో 36.9 కోట్ల మాల్‌వేర్‌లు వినియోగించారు. అంటే సగటున నిమిషానికి 702 దాడులు జరిగినట్లు ఈ నివేదిక చెబుతోంది.

    Details

    సైబర్ దాడుల్లో తెలంగాణ మొదటి స్థానం

    ఈ దాడులు ప్రధానంగా హెల్త్‌కేర్‌ (21.82%), ఆతిథ్యం (19.57%), బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (17.38%), ఎడ్యుకేషన్‌ (15.64%), MSME (7.52%), మాన్యుఫ్యాక్చరింగ్‌ (6.88%) రంగాలను లక్ష్యంగా చేసుకున్నాయి.

    ర్యాన్సమ్‌వేర్‌ గ్రూపులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను లక్ష్యంగా చేసుకుంటూ డేటాను బ్లాక్‌ చేసి, తిరిగి అప్పగించాలంటే భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాయి.

    ముఖ్యమైన 10 ర్యాన్సమ్‌వేర్‌ గ్రూపులలో రైసిడా, ర్యాన్సమ్‌హబ్‌, లాక్‌బిట్‌ 3.0 వంటి గ్రూపులు ముందున్నాయి.

    దేశంలో జరిగిన సైబర్‌ దాడుల గుర్తింపులో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.

    ఈ రాష్ట్రం 15.03% మాల్‌వేర్లను గుర్తించడం ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించింది.

    Details

    5జీ నెట్‌వర్క్‌ కారణంగా సైబర్ నేరాలు పెరిగే అవకాశం

    హైదరాబాద్‌లో ఉన్న బలమైన ఐటీ, సైబర్‌ భద్రతా ఫ్రేమ్‌వర్క్‌లు ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

    గూగుల్‌ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌, వన్‌డ్రైవ్‌ వంటి క్లౌడ్‌ ఫైల్‌ షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు సైబర్‌ నేరగాళ్ల ప్రధాన లక్ష్యంగా మారాయి.

    ఈ ప్లాట్‌ఫామ్‌లు డేటా షేరింగ్‌ సౌలభ్యం అందించడంతోపాటు సైబర్‌ దాడులకు అవకాశాలు పెరుగుతున్నాయి.

    రాబోయే రోజుల్లో డీప్‌ఫేక్‌లు, డేటా చౌర్యం, మాల్‌వేర్‌లు, ర్యాన్సమ్‌వేర్‌ నేరాలకు అవకాశాలు పెరుగుతాయని నివేదిక హెచ్చరిస్తోంది.

    5జీ నెట్‌వర్క్‌ విస్తరణతో సైబర్‌ ముప్పులు మరింత పెరుగుతాయని అంచనా.

    Details

    సైబర్‌ భద్రతకు సైబర్‌ హైజీన్ కీలకం

    సైబర్‌ భద్రతకు సైబర్‌ హైజీన్ కీలకమని నివేదిక స్పష్టం చేసింది.

    ఇందులో డేటా ప్రొటెక్షన్‌, మాల్‌వేర్‌ నివారణ, డేటా బ్యాకప్‌, మరియు ప్రైవసీ కంట్రోల్‌ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

    ముఖ్యంగా, ఏఐ ఆధారిత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసి, సైబర్‌ నేరాలను సమర్థంగా ఎదుర్కోవాలని నివేదిక సిఫార్సు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    తెలంగాణ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    Amazon AI : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్టార్టప్‌లో రూ.33 వేల కోట్ల పెట్టుబడులు అమెజాన్‌
    Rashmika deepfake: డీప్‌ఫేక్ వీడియోపై రష్మిక మందన్న ఆవేదన   రష్మిక మందన్న
    #deepfake: డీప్‌ఫేక్ వీడియోలు అంటే ఏమిటి? ఎలా తయారు చేస్తారు? నకిలీ వాటిని ఎలా గుర్తించాలి?  సాంకేతిక పరిజ్ఞానం
    OpenAI Sam Altman: షాకింగ్ న్యూస్.. 'ఓపెన్‌ఎఐ' సీఈఓ పదవి నుంచి సామ్ ఆల్ట్‌మన్ తొలగింపు  చాట్‌జీపీటీ

    తెలంగాణ

    Telangana Tourism: తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్.. 34 జలవనరుల్లో స్పీడ్, హౌస్‌బోట్లు భారతదేశం
    Medaram: మేడారం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు.. ప్రత్యేకంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్  మేడారం జాతర
    10th class: పదో తరగతి వార్షిక పరీక్షలలో కీలక మార్పులు.. ఈ ఏడాది నుంచి 100 మార్కులకు రాత పరీక్షలు భారతదేశం
    Kazipet Railway Coach: తెలంగాణకు మరో విభజన హామీని నెరవేర్చిన కేంద్రం.. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్ కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025