NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / China: 100Gbps లేజర్ టెక్‌తో 6G రేస్‌లో స్టార్‌లింక్‌ను ఓడించిన చైనా..! 
    తదుపరి వార్తా కథనం
    China: 100Gbps లేజర్ టెక్‌తో 6G రేస్‌లో స్టార్‌లింక్‌ను ఓడించిన చైనా..! 
    100Gbps లేజర్ టెక్‌తో 6G రేస్‌లో స్టార్‌లింక్‌ను ఓడించిన చైనా..!

    China: 100Gbps లేజర్ టెక్‌తో 6G రేస్‌లో స్టార్‌లింక్‌ను ఓడించిన చైనా..! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 02, 2025
    02:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనా డేటా ప్రసారం చేసే సాంకేతికతలో కీలకమైన ముందడుగు వేసింది.

    చాంగ్‌ గువాంగ్‌ శాటిలైట్‌ టెక్నాలజీ అనే సంస్థ సెకనుకు 100 గిగాబిట్స్‌ వేగంతో డేటాను ట్రాన్స్‌మిట్‌ చేయగల అత్యాధునిక హైరిజల్యూషన్‌ స్పేస్‌ టు గ్రౌండ్‌ లేజర్‌ ట్రాన్స్‌మిషన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.

    ఈ ప్రయోగంలో జిలిన్‌-1 ఉపగ్రహం నుంచి ట్రక్‌పై ఏర్పాటు చేసిన గ్రౌండ్‌ స్టేషన్‌కు డేటాను ప్రసారం చేశారు. ఇది గత రికార్డుతో పోలిస్తే 10 రెట్లు వేగంగా ఉండటం విశేషం.

    ఈ టెక్నాలజీ గురించి లేజర్‌ గ్రౌండ్‌ కమ్యూనికేషన్స్‌ అధిపతి వాంగ్‌ హాంగ్‌హాంగ్‌ మాట్లాడుతూ, స్టార్‌లింక్ 6జీ టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నదన్న వార్తలు అధికారికంగా నిర్ధారించబడలేదని చెప్పారు.

    వివరాలు 

    100 జీబీపీఎస్ డేటా అంటే సుమారు 10 పూర్తి స్థాయి సినిమాల సైజుకు సమానం

    కానీ, ఈ సాంకేతికతలో తమ సంస్థ మస్క్‌ కంపెనీని దాటిపోయిందని వివరించారు.

    "స్టార్‌లింక్‌ లేజర్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను అభివృద్ధి చేసింది. అయితే, వారు ఇంకా శాటిలైట్‌ టు గ్రౌండ్‌ కమ్యూనికేషన్‌ కోసం దానిని ఉపయోగించలేదు. వారి వద్ద టెక్నాలజీ ఉండవచ్చు, కానీ మేము ఇప్పటికే దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నాం" అని తెలిపారు.

    ఈ సంస్థ 2027 నాటికి జిలిన్‌-1 శ్రేణిలోని ఉపగ్రహాలను పూర్తి కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

    100 జీబీపీఎస్ డేటా అంటే సుమారు 10 పూర్తి స్థాయి సినిమాల సైజుకు సమానం.

    దీన్ని చైనా సంస్థ కేవలం ఒక సెకనులో ప్రసారం చేయగలిగింది.

    ఇదే గరిష్ట వేగాన్ని గతంలో మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ,నాసా టెరాబైట్‌ ఇన్ఫ్రారెడ్‌ డెలివరీ సిస్టమ్స్‌ సాధించాయి.

    వివరాలు 

    5జీ ఆధారిత అత్యాధునిక మొబైల్‌ స్టేషన్‌ను అభివృద్ధి చేసిన చైనా 

    ప్రపంచ వ్యాప్తంగా 5జీ కమ్యూనికేషన్‌ ప్రస్తుతం ప్రధానంగా వాడుకలో ఉంది. అయితే, 6జీ దాని ఆధునిక వెర్షన్‌గా వస్తోంది.

    ఇది అత్యధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను ఉపయోగిస్తుంది. చైనా తాజాగా 5జీ ఆధారిత అత్యాధునిక మొబైల్‌ స్టేషన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది.

    ఇది యుద్ధ వాతావరణంలో కూడా మూడు కిలోమీటర్ల పరిధిలో 10,000 మందికి అత్యంత సురక్షితంగా మరియు వేగవంతంగా డేటాను ప్రసారం చేయగలదు.

    ఈ స్టేషన్‌ను చైనా మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ గ్రూప్‌ మరియు ది పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    చైనా

    Znong Yang: 58మందితో అక్రమ సంబంధాలు.. 'బ్యూటిఫుల్ గవర్నర్'కు జైలు శిక్ష ప్రపంచం
    China: ల్యాండింగ్ ప్రయత్నంలో చైనా డీప్‌ బ్లూ రాకెట్‌ పేలుడు.. వీడియో వైరల్   టెక్నాలజీ
    China Economy: వడ్డీ రేట్ల తగ్గింపు.. స్థిరాస్తి సంక్షోభాన్ని నివారించేందుకు చైనా కీలక చర్యలు  వ్యాపారం
    China: శక్తిమంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన చైనా PLA  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025