SGI: మూడు గంటల్లో కంటెంట్ తొలగింపు.. క్రియేటర్లు, ఏజెన్సీల్లో భయాందోళనలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రియేటర్ ఎకానమీపై కొత్త నిబంధనలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సోషల్ మీడియా వేదికల్లో ఫ్లాగ్ చేసిన కంటెంట్ను కేవలం మూడు గంటల్లో తొలగించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తాజా మార్పులు చేసింది. ఫిబ్రవరి 11న కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, 2021లో అమల్లోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు, 2021 కు సవరణలు జారీ చేసింది. ఇంతకు ముందు ఫ్లాగ్ చేసిన కంటెంట్ను తొలగించేందుకు 36 గంటల గడువు ఉండగా, ఇప్పుడు దాన్ని కేవలం మూడు గంటలకు కుదించారు.
Details
చట్టవిరుద్ధ కంటెంట్ వేగంగా వ్యాప్తి
ఈ నిర్ణయం ముఖ్యంగా ఏఐ సాయంతో తయారయ్యే డీప్ఫేక్లు, హానికరమైన చట్టవిరుద్ధ కంటెంట్ వేగంగా వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ తక్షణ గడువు కారణంగా సృజనాత్మక రంగానికి చెందిన కంటెంట్ క్రియేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ క్రియేటర్ ఏక్తా మఖిజాని ఈ 'నిర్ణయాన్ని అత్యంత కఠినమైన గడువు'గా అభివర్ణించారు. బ్రాండ్ క్యాంపెయిన్ ప్రారంభ సమయంలో నా వీడియో తప్పుగా ఫ్లాగ్ అయితే, మొత్తం క్యాంపెయిన్ అవకాశమే కోల్పోయే ప్రమాదం ఉంది. ఆటోమేటెడ్ సిస్టమ్స్ త్వరగా నిర్ణయాలు తీసుకుంటాయి. ఈకొత్త నిబంధనలు చట్టవిరుద్ధ కంటెంట్పై కట్టడి చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నప్పటికీ, అమలువిధానం, తక్షణ గడువు క్రియేటర్లకు సవాలుగా మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.