LOADING...
e200X Electric Air Taxi: భారత్ తొలి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ఇ200ఎక్స్ అసెంబ్లీ పూర్తి.. చెన్నై స్టార్టప్ ఘనత
భారత్ తొలి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ఇ200ఎక్స్ అసెంబ్లీ పూర్తి.. చెన్నై స్టార్టప్ ఘనత

e200X Electric Air Taxi: భారత్ తొలి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ఇ200ఎక్స్ అసెంబ్లీ పూర్తి.. చెన్నై స్టార్టప్ ఘనత

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నైకు చెందిన డీప్-టెక్ స్టార్టప్ ద ఇప్లేన్ కంపెనీ తన పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ఇ200ఎక్స్ అసెంబ్లింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. విమానంలోని కీలక ఉపవ్యవస్థలన్నింటినీ ఒకే నిర్మాణంలో సమీకరించి ఈ ఎయిర్ టాక్సీని రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. అసెంబ్లింగ్‌ పూర్తైన అనంతరం ఇప్పుడు ఈ విమానాన్ని గ్రౌండ్ టెస్టింగ్ దశలోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపింది. ప్రత్యేక పరీక్షా పరికరాలతో విమాన నిర్మాణం, ఆన్‌బోర్డ్ వ్యవస్థల పనితీరును పరిశీలించనున్నారు. అలాగే ఏరోడైనమిక్, మెకానికల్ లోడ్‌లను తట్టుకునే సామర్థ్యం ఉందా అనే అంశాన్ని కూడా పరీక్షిస్తారు. ఈ పరీక్షలు విజయవంతంగా పూర్తైన తర్వాత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ నుంచి టైప్ సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది.

వివరాలు 

మూడు విభాగాల్లో సేవలు

ఇప్పటికే తొలి ప్రోటోటైప్ పీటీ-01ను పూర్తి చేసిన సంస్థ, ఇప్పుడు ఇ200ఎక్స్ను డిజైన్, సిమ్యులేషన్ దశ నుంచి భౌతిక పరీక్షల దశలోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని మూడు రకాల సేవలకు అనువుగా అభివృద్ధి చేశారు. ప్రయాణికుల రవాణా, నగరాల్లో సరకు రవాణా, అలాగే ఎయిర్ అంబులెన్స్ సేవలకు ఉపయోగపడేలా దీని ఎయిర్‌ఫ్రేమ్‌ను రూపొందించారు. ముందుగా వాణిజ్య సరకు రవాణా సేవలను ప్రారంభించి, అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియలు పూర్తయ్యే కొద్దీ ప్రయాణికుల రవాణా, వైద్య అత్యవసర సేవలకు కూడా విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఇప్పటివరకు 21 మిలియన్ డాలర్లు (సుమారు రూ.200 కోట్లు) పెట్టుబడులు సమీకరించినట్లు సంస్థ వెల్లడించింది.

Advertisement