English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Microsoft Turns 50 : MS-DOS నుంచి AI వరకూ.. 50 ఏళ్ల మైక్రోసాఫ్ట్‌ ప్రయాణం ఓ అధ్యాయమే!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Microsoft Turns 50 : MS-DOS నుంచి AI వరకూ.. 50 ఏళ్ల మైక్రోసాఫ్ట్‌ ప్రయాణం ఓ అధ్యాయమే!
    MS-DOS నుంచి AI వరకూ.. 50 ఏళ్ల మైక్రోసాఫ్ట్‌ ప్రయాణం ఓ అధ్యాయమే!

    Microsoft Turns 50 : MS-DOS నుంచి AI వరకూ.. 50 ఏళ్ల మైక్రోసాఫ్ట్‌ ప్రయాణం ఓ అధ్యాయమే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 02, 2025
    05:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యాభై సంవత్సరాలు అనేవి మామూలు విషయం కాదు. ఇది ఒక గొప్ప మైలురాయి.

    మైక్రోసాఫ్ట్ సంస్థను స్థాపించిన వారు, నడిపిన వారు, అలాగే ఇప్పటిదాకా దాని నిలయంగా నిలిచిన ప్రతి ఒక్కరూ అభినందనీయులు. 50 ఏళ్ల వేడుక ఒక విశిష్ట సందర్భం.

    ఇది సమాజానికి అవసరమైన, ప్రేరణనిచ్చే వేడుక. గత విజయాలను స్మరించుకుంటూ, భవిష్యత్తుకు బాటలు వేసే అరుదైన అవకాశమిది.

    విజయాలు, నేర్పిన పాఠాలు, లభించిన అనుభవాలన్నింటినీ శక్తిగా మలుచుకొని ముందుకు సాగడానికి ఇది మరింత ప్రేరణనిస్తుంది.

    Details

    చిన్న ఆలోచన నుంచి టెక్ దిగ్గజంగా ఎదిగిన ప్రస్థానం 

    1975లో బాల్య స్నేహితులు బిల్‌ గేట్స్‌, పాల్‌ అలెన్‌ కలిసి మైక్రోసాఫ్ట్‌ను స్థాపించారు. అప్పట్లో కంప్యూటర్లు పెద్దవిగా, ఖరీదైనవిగా ఉండేవి.

    అందుబాటులోకి తెచ్చి ప్రతి ఇంట్లో, ప్రతి కార్యాలయంలో కంప్యూటర్‌ ఉండాలన్నదే వారి కల. MS-DOS తో మొదలైన ప్రయాణం, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల విప్లవానికి నాంది పలికింది.

    ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన కార్పొరేట్ సంస్థలలో ఒకటిగా నిలిచింది. మైక్రోసాఫ్ట్ వల్ల వ్యక్తిగత కంప్యూటింగ్‌, పని చేసే తీరు, ఆటల రంగం, కమ్యూనికేషన్‌ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

    మీరు
    33%
    శాతం పూర్తి చేశారు

    Details

    50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలు 

    స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా మైక్రోసాఫ్ట్‌ నూతన కార్యక్రమాలను ప్రకటించింది. వాషింగ్టన్‌లోని పుగెట్‌ సౌండ్‌లో 50 మంది స్థానిక నాయ‌కులకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ ప్రతిఒక్కరికీ $50,000 బహుమతిగా అందిస్తోంది.

    "వన్ ఫ్యూచర్, వన్ సౌండ్" అనే ఈ కార్యక్రమం ద్వారా సంస్థ తన స్థాపన ప్రాంతానికి కృతజ్ఞతను చాటుతోంది.

    ఇక ప్రపంచ స్థాయిలో, మైక్రోసాఫ్ట్‌ 'AI ఫర్ గుడ్' అనే $5 మిలియన్‌ ఫండ్‌ను ప్రకటించింది.

    పర్యావరణ పరిరక్షణ, తక్కువ ఖర్చుతో గృహనిర్మాణం, క్లీన్ ఎనర్జీ వంటి సమస్యల పరిష్కారానికి AI వినియోగించే సంస్థలకు మద్దతుగా ఈ నిధులను అందించనుంది.

    మీరు
    66%
    శాతం పూర్తి చేశారు

    Details

    భారతదేశంపై ప్రత్యేక దృష్టి 

    1990లో భారతదేశంలో ప్రవేశించిన మైక్రోసాఫ్ట్‌ దేశ డిజిటల్‌ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.

    AI, క్లౌడ్‌ టెక్నాలజీ, అజూర్‌ సేవల ద్వారా వ్యాపారాలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలను మరింత శక్తివంతం చేస్తోంది. తాజాగా మైక్రోసాఫ్ట్‌ భారతదేశంలో తమ విస్తరణ కోసం రాబోయే రెండేళ్లలో $3 బిలియన్ల పెట్టుబడి పెట్టనుంది.

    ఇది 2047 నాటికి డిజిటల్‌ ఇండియా రూపకల్పనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. 2030 నాటికి 10 మిలియన్ల మంది భారతీయులకు AI నైపుణ్యాలను అందించేందుకు సంస్థ కృషి చేస్తోంది.

    50 ఏళ్ల విజయాన్ని సాధించిన మైక్రోసాఫ్ట్‌ భవిష్యత్తులో మరిన్ని వినూత్న మార్గాలను అన్వేషించే దిశగా ముందుకు సాగుతోంది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మైక్రోసాఫ్ట్
    ఇండియా

    తాజా

    Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం.. ప్రచార సభలో కాల్పులు కొలంబియా
    Lalithaa Jewellery: రూ.1700 కోట్లతో స్టాక్ మార్కెట్‌లోకి లలితా జువెలరీ.. తొలిసారిగా ఐపీఓ దిశగా అడుగులు ఐపీఓ
    Maganti Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత బీఆర్ఎస్
     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్

    మైక్రోసాఫ్ట్

    Xbox games: PS5, నింటెండో స్విచ్‌కి మరిన్ని Xbox గేమ్‌లు  టెక్నాలజీ
    Microsoft : వివాదాస్పద AI ఫీచర్ 'రీకాల్' లాంచ్‌ను వాయిదా వేసిన మైక్రోసాఫ్ట్   టెక్నాలజీ
    NVIDIA: మైక్రోసాఫ్ట్ ను పక్కకు నెట్టి నెంబర్ 1 గా నిలిచిన NVIDIA  నివిడియా
    Microsoft: Wi-Fi వల్నరబిలిటీకి వ్యతిరేకంగా అప్‌డేట్ చేయమని వినియోగదారులను కోరిన మైక్రోసాఫ్ట్ విండోస్  టెక్నాలజీ

    ఇండియా

    Inter Exams: ఇంటర్ బోర్డు నూతన నిబంధన.. ఈసారి అలస్యమైనా అవకాశం తెలంగాణ
    LRS: ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. 10 రోజుల్లోనే సమస్య పరిష్కారం! తెలంగాణ
    Mamunur Airport: మామునూరు ఎయిర్‌పోర్ట్ విస్తరణ.. భూసేకరణపై రైతులు ఆందోళన తెలంగాణ
    AP: డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న మహిళలకు సూపర్ ఛాన్స్.. ర్యాపిడోతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025