Page Loader
Pig Butchering: గృహిణులు, విద్యార్థులు లక్ష్యంగా సైబర్‌ మోసాలు.. ఏమిటీ ఈ పిగ్‌ బుచరింగ్‌?
గృహిణులు, విద్యార్థులు లక్ష్యంగా సైబర్‌ మోసాలు.. ఏమిటీ ఈ పిగ్‌ బుచరింగ్‌?

Pig Butchering: గృహిణులు, విద్యార్థులు లక్ష్యంగా సైబర్‌ మోసాలు.. ఏమిటీ ఈ పిగ్‌ బుచరింగ్‌?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర హోంశాఖ తాజా నివేదిక ప్రకారం,నిరుద్యోగ యువత,గృహిణులు,విద్యార్థులు,పేదలను లక్ష్యంగా చేసుకొని,'పిగ్‌ బుచరింగ్‌ స్కామ్‌'లేదా'ఇన్వెస్ట్‌మెంట్‌ స్కామ్‌'పేరుతో సైబర్‌ మోసాలు భారీగా పెరుగుతున్నాయి. ఈమోసాల కారణంగా రోజువారీగా ప్రజలు భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు.ఈమోసాల కోసం సైబర్‌ నేరగాళ్లు గూగుల్‌ వంటి వేదికలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని నివేదిక తెలియజేస్తోంది. గూగుల్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ విదేశాల నుంచి లక్షిత ప్రకటనలు ఇచ్చేందుకు సౌలభ్యాన్ని కల్పిస్తోందని,దీన్ని సైబర్‌ నేరగాళ్లు సద్వినియోగం చేసుకుంటున్నారని నివేదిక వెల్లడించింది. ఈ తరహా మోసాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుండగా,మనీలాండరింగ్‌ తోపాటు సైబర్‌ బానిసత్వం వంటి ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. భారత్‌లో సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్ వేదికగా మోసాలకు పాల్పడుతూ,ఫేస్‌ బుక్‌ వంటి వేదికల ద్వారా రుణాలు ఇస్తామని చెప్పి లింకులను వ్యాప్తి చేస్తున్నట్లు నివేదిక తెలిపింది.

వివరాలు 

పిగ్‌ బుచరింగ్‌ స్కామ్‌ అంటే ఏమిటి? 

ఈ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ (I4C) గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తోంది. సైబర్‌ నేరగాళ్లు తేలికగా మోసపోయే వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని,వారిలో విశ్వాసం కలిగించేలా పరిచయం పెంచుకుంటారు. ఆపై,క్రిప్టోకరెన్సీ లేదా లాభదాయకమైన పథకాల పేరుతో పెట్టుబడి పెట్టించుకుంటారు.చివరికి ఆ నగదును తస్కరిస్తారు. ఈ విధమైన ఆన్‌లైన్‌ మోసాలను 'పిగ్‌ బుచరింగ్‌ స్కామ్‌'గా పిలుస్తారు. పందులను వధించే ముందు వాటికి మంచి ఆహారం అందించే భావనతో ఈ పేరును ఉపయోగించారు. ఈ స్కామ్‌ మొదట 2016లో చైనాలో ప్రారంభమైనట్లు భావించబడుతోంది. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.