NASA: గంటకు 21 వేల మైళ్ల వేగం.. భూమికి సమీపంగా రానున్న భారీ ఆస్టరాయిడ్
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్షంలో సంచరిస్తున్న భారీ గ్రహశకలం 2025 YU15 ఈరోజు భూమికి సమీపంగా వెళ్లనుంది. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ గ్రహశకలం ఫిబ్రవరి 20న భూమికి అత్యంత సమీపంగా చేరుకుంటుంది.
Details
భూమికి ఎంత దూరం?
సుమారు 410 అడుగుల వెడల్పు కలిగిన ఈ గ్రహశకలం గంటకు 21,306 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. అత్యంత సమీప సమయంలో ఇది భూమికి దాదాపు 36.6 లక్షల మైళ్ల దూరంలోనే ఉంటుంది. ఖగోళ పరంగా ఇది 'సమీప దూరం'గా పరిగణించినా, ప్రమాదకర స్థాయిలో కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రహశకలం 'అటెన్' (Aten) గ్రూప్కు చెందినది. ఈ వర్గానికి చెందిన గ్రహశకలాలు భూమి కక్ష్యను దాటే స్వభావం కలిగి ఉంటాయి. అందుకే శాస్త్రవేత్తలు ఇటువంటి వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచుతారు.
Details
ప్రమాదముందా?
NASA ప్రమాణాల ప్రకారం ప్రమాదకర గ్రహశకలంగా పరిగణించాలంటే అది భూమికి 7.4 మిలియన్ కిలోమీటర్ల లోపలికి రావాలి. అలాగే దాని పరిమాణం 85 మీటర్లకు మించి ఉండాలి. 2025 YU15 ఈ ప్రమాణాలను తీరచేయదు. అందువల్ల తక్షణ ప్రమాదం లేదని స్పష్టం చేశారు. అయితే చిన్నపాటి కక్ష్య మార్పులు కూడా భవిష్యత్తులో ప్రభావం చూపే అవకాశం ఉండటంతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. గురుత్వాకర్షణ ప్రభావాలు కక్ష్యను స్వల్పంగా మార్చే అవకాశముంది. అందుకే అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా గమనిక కొనసాగిస్తున్నాయి.
Details
భారత్ కూడా సిద్ధం
భారత అంతరిక్ష సంస్థ ISRO కూడా గ్రహశకలాల పరిశోధనపై దృష్టి సారిస్తోంది. 2029లో భూమికి సమీపంగా రానున్న 'అపోఫిస్' (Apophis) గ్రహశకలంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని భావిస్తోంది. ఇందుకోసం NASAతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA)లతో సహకారం పెంచే యోచనలో ఉంది. భవిష్యత్తులో గ్రహశకలాలపై ల్యాండింగ్ మిషన్లు చేపట్టే అవకాశాలూ పరిశీలనలో ఉన్నాయి. అంతరిక్ష నిఘా ప్రాధాన్యం ప్రస్తుతం ప్రమాదం లేకపోయినా, 2025 YU15 ప్రయాణం గ్రహశకలాల అనిశ్చిత స్వభావాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. స్పేస్ సర్వేలెన్స్ వ్యవస్థల ప్రాముఖ్యతను ఈ ఘటన రుజువు చేస్తోంది. శాస్త్రవేత్తలు ఈ ఫ్లైబైను నిరంతరం పర్యవేక్షిస్తూ భవిష్యత్ అంచనాలను మెరుగుపరుస్తున్నారు.