LOADING...
Anil Menon: అంతరిక్ష యాత్రకు భారత సంతతి శాస్త్రవేత్త అనిల్ మీనన్.. ఐఎస్ఎస్‌లో 240 రోజుల మిషన్!
ఐఎస్ఎస్‌లో 240 రోజుల మిషన్!

Anil Menon: అంతరిక్ష యాత్రకు భారత సంతతి శాస్త్రవేత్త అనిల్ మీనన్.. ఐఎస్ఎస్‌లో 240 రోజుల మిషన్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2026
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ తన తొలి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. వైద్యుడు,ఇంజినీర్ అయిన ఆయన 2026 జూలై 14న రష్యాకు చెందిన సోయుజ్ ఎంఎస్-29 వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు బయలుదేరనున్నారు. ఈ మిషన్‌లో భాగంగా దాదాపు 240 రోజుల పాటు అంతరిక్షంలో గడపనున్న ఆయన, నాసా చేపట్టే కీలక శాస్త్రీయ పరిశోధనల్లో పాల్గొననున్నారు.

వివరాలు 

జూలైలో ఐఎస్ఎస్ మిషన్ ప్రారంభం

అనిల్ మీనన్ ప్రయాణించే సోయుజ్ ఎంఎస్-29 వ్యోమనౌక 2026 జూలై 14న కజకిస్థాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ప్రయోగించనున్నారు. ఈ బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 2027 వసంతకాలం వరకు ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహాలపై మానవ యాత్రలకు ఉపయోగపడే పలు కీలక ప్రయోగాలు నిర్వహించనున్నారు. భారత్'తో అనుబంధం అమెరికాలోని మిన్నియాపోలిస్‌లో జన్మించిన అనిల్ మీనన్.. భారతీయ తండ్రి, ఉక్రెయిన్‌కు చెందిన తల్లి సంతానం. భారతీయ మూలాలు కలిగిన వ్యోమగామిగా ఆయన అంతరిక్ష యాత్రపై భారత్‌లో ఆసక్తి నెలకొంది. ప్రపంచ స్థాయి అంతరిక్ష మిషన్లలో పాల్గొంటున్న భారత సంతతి శాస్త్రవేత్తల జాబితాలో అనిల్ మీనన్ కూడా చేరనున్నారు.

వివరాలు 

అనిల్ మీనన్ ఒక్కడే వెళ్తున్నారా?

అంతరిక్ష యాత్రలు ఎప్పుడూ బృందాల వారీగా జరుగుతాయి. అనిల్ మీనన్‌తో పాటు రష్యా వ్యోమగాములు ప్యోతర్ డుబ్రోవ్, అన్నా కికినా ఈ మిషన్‌లో పాల్గొంటున్నారు. వీరంతా కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శాస్త్రీయ పరిశోధనలు చేపట్టనున్నారు. 240 రోజుల తొలి అంతరిక్ష ప్రయాణం అనిల్ మీనన్ తన తొలి అంతరిక్ష యాత్రలో దాదాపు ఎనిమిది నెలలు లేదా 240 రోజుల పాటు కక్ష్యలో ఉండనున్నారు. నాసా వ్యోమగామి, ఫ్లైట్ సర్జన్, ఏరోస్పేస్ నిపుణుడిగా ఎన్నో ఏళ్ల శిక్షణ అనంతరం ఆయన ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ మిషన్ ద్వారా భవిష్యత్తు అంతరిక్ష పరిశోధనలకు అవసరమైన కీలక సమాచారాన్ని సేకరించనున్నారు.

Advertisement

వివరాలు 

ఐఎస్ఎస్ మిషన్ లక్ష్యమేంటి?

అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉండే పరిస్థితుల్లో మానవ శరీరంలో జరిగే మార్పులను అధ్యయనం చేయడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యమని నాసా వెల్లడించింది. రక్త ప్రసరణ, సిరల నిర్మాణంలో మార్పులు, వైద్య చికిత్సలకు అవసరమైన ఇంట్రావీనస్ ద్రవాల తయారీ వంటి అంశాలపై పరిశోధనలు జరగనున్నాయి. అంతరిక్ష కేంద్రంలో అందుబాటులో ఉన్న నీటిని ఉపయోగించి ఈ ద్రవాలను తయారు చేసి పరీక్షించనున్నారు. ఈ పరిశోధనల ఫలితాలు భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహాలకు సుదూర అంతరిక్ష యాత్రలు చేసే వ్యోమగాములకు ఎంతగానో ఉపయోగపడటంతో పాటు, భూమిపై వైద్య రంగానికి కూడా కొత్త మార్గాలను చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Advertisement