
Dangeti Jahnavi: అంతరిక్షంలోకి తొలి భారతీయ మహిళ.. తెలుగమ్మాయిగా జాహ్నవి రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలు గ్రామానికి చెందిన 23 ఏళ్ల జాహ్నవి డంగేటి చరిత్ర సృష్టించనున్నారు. అంతరిక్షయానం అందరికీ సాధ్యంకాని విపరీత కృషి కావాలి. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ 'టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ' చేపట్టిన 'టైటాన్ స్పేస్ మిషన్'కోసం జాహ్నవి 'ఆస్ట్రోనాట్ కాండిడేట్' (ASCAN)గా ఎంపిక అయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్కు నాసా మాజీ వ్యోమగామి విలియం మెక్ ఆర్థర్ జూనియర్ నాయకత్వం వహించనున్నారు. భారతదేశంలో పుట్టి, ఇక్కడే నివసించిన మహిళ నేరుగా అంతరిక్షయానానికి ఎంపిక కావడం ఇదే తొలిసారి. టైటాన్ స్పేస్ ప్రతినిధులు పలు రౌండ్ల పరీక్షలు నిర్వహించగా, అన్ని అర్హతలను జాహ్నవి విజయవంతంగా పూర్తి చేశారు.
Details
అంతరిక్ష కేంద్రం నిర్మాణం
టైటాన్ స్పేస్ రోదసీలో ఒక భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్తులో ఇది అంతరిక్ష ప్రయోగాలకే కాకుండా, అంతరిక్ష పర్యాటకానికి కూడా కేంద్రంగా ఉపయోగపడనుంది. ప్రాజెక్ట్లో భాగంగా మొదట కొద్దిమంది అంతరిక్ష పరిశోధక వ్యోమగాములను, పర్యాటకులను అంతరిక్షంలోకి పంపనున్నారు. 2029 మార్చిలో జరగనున్న మొదటి అంతరిక్షయానంలో భారత్ నుంచి జాహ్నవి డంగేటి పాల్గొననున్నారు. ఈ యాత్రలో ఆమె ఐదు గంటలపాటు అంతరిక్షంలో గడుపనున్నారు. కఠిన శిక్షణ ప్రణాళిక ఈ మిషన్కి ఎంపికైన అభ్యర్థులకు రానున్న మూడేళ్లపాటు అమెరికాతో పాటు పలు దేశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మిషన్కి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
Details
నాసా శిక్షణలో రికార్డు
2021లో నాసా నిర్వహించిన 'ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్'కి భారత్ తరపున జాహ్నవి ఎంపికై రికార్డు సృష్టించారు. 2026 నుంచి మూడేళ్లపాటు టైటాన్ స్పేస్ ASCAN ప్రోగ్రామ్ ద్వారా ఆమె కఠిన అంతరిక్షయానం శిక్షణ పొందనున్నారు. ఇందులో ఫ్లైట్ సిమ్యులేషన్, అంతరిక్ష నౌకల నిర్వహణ, సర్వైవల్ శిక్షణ, మెడికల్, సైకాలజికల్ అಸೆస్మెంట్లపై శిక్షణ ఉంటుంది. 2029లో ఐదు గంటలపాటు సాగనున్న ఈ కక్ష్యా అంతరిక్షయానం శాస్త్రీయ పరిశోధన, మానవ అంతరిక్ష అన్వేషణలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని జాహ్నవి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
Details
ఆసక్తిని రికార్డులుగా మలిచిన యువతి
జాహ్నవి పాలకోలు పట్టణంలో జన్మించి అక్కడే పెరిగారు. బీటెక్ పూర్తి చేసిన జాహ్నవికి చిన్ననాటి నుండే అంతరిక్షంపై ఆసక్తి ఉంది. ఈ క్రమంలోనే 2022లో పోలాండ్లోని అనలాగ్ వ్యోమగాముల శిక్షణ కేంద్రం (AATC)లో శిక్షణ పొందిన జాహ్నవి, అతి చిన్న వయసులోనే అనలాగ్ వ్యోమగామిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా నాసా 'ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్'లో పాల్గొని చరిత్ర సృష్టించారు. ఇప్పటికే 'సెస్నా 171 స్కైహాక్' అనే చిన్న రాకెట్ను విజయవంతంగా నడిపిన ఆమె, జీరో గ్రావిటీ, మల్టీ యాక్సిస్ శిక్షణ, అండర్ వాటర్ రాకెట్ లాంచ్, ఎయిర్క్రాఫ్ట్ నడిపే శిక్షణలను కూడా పూర్తి చేశారు. 16 దేశాల యువతతో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్గా పనిచేశారు.
Details
ఆకాంక్షలకు అంకురం వేసిన అమ్మమ్మ కథలు
జాహ్నవి అంతరిక్షయానం పట్ల ఆకర్షితురాలై రికార్డులకే కేరాఫ్ అడ్రెస్ కావడానికి కారణం ఆమె అమ్మమ్మ లీలావతి. తల్లిదండ్రులు కువైట్లో ఉన్న సమయంలో అమ్మమ్మ దగ్గరే పెరిగిన జాహ్నవి, చందమామ కథలు వింటూ అంతరిక్షంపై ఆసక్తిని పెంపొందించుకున్నారు. ఈ కథలే ఆమెను అంతరిక్షయానానికి ప్రేరేపించాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.