LOADING...
WhatsApp 6-hour Logout: వాట్సాప్ యూజర్లకు కీలక సూచన.. ప్రతి 6 గంటలకు ఇక ఆటో లాగ్‌ అవుట్‌!
వాట్సాప్ యూజర్లకు కీలక సూచన.. ప్రతి 6 గంటలకు ఇక ఆటో లాగ్‌ అవుట్‌!

WhatsApp 6-hour Logout: వాట్సాప్ యూజర్లకు కీలక సూచన.. ప్రతి 6 గంటలకు ఇక ఆటో లాగ్‌ అవుట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2025
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లలో అగ్రస్థానంలో ఉన్న వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. తాజాగా వాట్సాప్ సేవల వినియోగానికి సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సైబర్ నేరాలను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త సైబర్ భద్రతా నియమావళిని అమలు చేసింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ ఇకపై యాక్టివ్ సిమ్ కార్డ్ లేకుండా పని చేయదు. దేశంలోWhatsApp, Telegramవంటి యాప్‌లు విస్తృతంగా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లుగా ఉపయోగించబడుతున్నాయి. పెరుగుతున్న సైబర్ మోసాలు, ఆన్‌లైన్ క్రిమినల్ కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మెసేజింగ్ యాప్‌ల వ్యవస్థలో పెద్ద మార్పులు చేసింది. కొత్త నియమాల ప్రకారం ఫోన్‌లో యాక్టివ్ సిమ్ ఉన్నప్పుడే ఏ మెసేజింగ్ యాప్ పనిచేస్తుంది. ఫోన్ నుంచి సిమ్ తీసేస్తే యాప్ వెంటనే ఆగిపోతుంది.

Details

కొత్త మార్గదర్శకాలు జారీ

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, నేరస్థులు అసలు సిమ్‌ను తొలగించి నకిలీ నంబర్లు, VPN, ఫేక్ అకౌంట్లను వినియోగించి Wi-Fi లేదా ఇంటర్నెట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ లొసుగును పూర్తిగా మూసివేయడానికే కొత్త మార్గదర్శకాలు రూపొందించాయి. WhatsApp, Telegram, Snapchat, ShareChat, GChat, Josh వంటి మొబైల్ నంబర్ ఆధారిత అన్ని యాప్‌లకూ ఈ నియమాలు తప్పనిసరి అవుతున్నాయి. టెలికమ్యూనికేషన్స్ సైబర్ సెక్యూరిటీ సవరణ నియమాలు 2025 ప్రకారం, టెలికమ్యూనికేషన్స్ విభాగం యాప్ కంపెనీలను ఈ సంస్కరణలను 90 రోజుల్లోపు అమలు చేయాలని ఆదేశించింది. యూజర్ సిమ్ యాక్టివ్‌గా, మొబైల్‌లో ఉన్నప్పుడే ఖాతా యాక్టివ్‌గా ఉండేలా కంపెనీలు నిర్ధారించాల్సి ఉంటుంది. సిమ్ లేకుండా పనిచేస్తున్న యాప్‌లు ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతాయి.

Details

వాట్సాప్ వెబ్‌లో కూడా కీలక మార్పులు

ఈ నియమాలు మొబైల్ యాప్‌కే కాకుండా WhatsApp Web‌కు కూడా వర్తిస్తాయి. ఇప్పుడు WhatsApp Web ప్రతి ఆరు గంటలకు ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతుంది. వినియోగదారుడు మళ్లీ లాగిన్ కావాలంటే మొబైల్ ద్వారా QR కోడ్‌ను రీ-స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఒకసారి OTP ధృవీకరణతో యాప్ పనిచేసేది. అయితే DoT కొత్త ఆదేశాల మేరకు, యాప్ కంపెనీలు సిమ్‌లో నిల్వ ఉండే IMSI (International Mobile Subscriber Identity)ను యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రతి మొబైల్ వినియోగదారుని ప్రత్యేకంగా గుర్తించే సంఖ్య. సిమ్ తీసివేసినా యాప్ కొనసాగుతున్న loophole‌ను సైబర్ నేరస్థులు వినియోగిస్తున్న నేపథ్యంలో, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కొత్త నియమాలను రూపొందించింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్టు

Advertisement