LOADING...
Microsoft Teams: మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్త ఫీచర్.. టీమ్స్ ద్వారా ఉద్యోగుల లొకేషన్ ఆటోమేటిక్‌గా బాస్‌కు వెంటనే సమాచారం!
టీమ్స్ ద్వారా ఉద్యోగుల లొకేషన్ ఆటోమేటిక్‌గా బాస్‌కు వెంటనే సమాచారం!

Microsoft Teams: మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్త ఫీచర్.. టీమ్స్ ద్వారా ఉద్యోగుల లొకేషన్ ఆటోమేటిక్‌గా బాస్‌కు వెంటనే సమాచారం!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 22, 2026
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

హైబ్రిడ్ వర్క్ విధానం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, మైక్రోసాఫ్ట్ తన టీమ్స్ ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఉద్యోగులు ఆఫీసు వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిన వెంటనే వారి వర్క్ లొకేషన్ స్వయంచాలకంగా అప్‌డేట్ అవుతుంది. దీంతో వారు కార్యాలయంలో ఉన్నారా, రిమోట్‌గా పనిచేస్తున్నారా లేదా ఏ భవనంలో ఉన్నారనే సమాచారం సహోద్యోగులు, మేనేజర్లకు సులభంగా తెలుస్తుంది. అయితే ఈ ఫీచర్‌పై ఇప్పటికే మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని హైబ్రిడ్ వర్క్‌కు ఉపయోగకరమైన సాధనంగా అభివర్ణిస్తుండగా, మరికొందరు ఉద్యోగుల గోప్యతకు ముప్పుగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

ఉద్యోగి సంస్థకు చెందిన ఆఫీసు వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయినప్పుడు,మైక్రోసాఫ్ట్ టీమ్స్ అతని లేదా ఆమె లొకేషన్‌ను ఆటోమేటిక్‌గా "In the Office"గా అప్‌డేట్ చేస్తుంది. కొన్ని సంస్థల్లో డాకింగ్ స్టేషన్లు లేదా ఇతర డెస్క్ పరికరాలతో అనుసంధానం చేయడం ద్వారా ఏ బిల్డింగ్ లేదా ఫ్లోర్‌లో ఉన్నారో కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. ఆఫీసు నుంచి బయటకు వెళ్తే... ఉద్యోగి ఆఫీసు వై-ఫై నుంచి డిస్‌కనెక్ట్ అయినప్పుడు, వారి వర్క్ లొకేషన్ ఆటోమేటిక్‌గా రిమోట్ వర్క్‌గా మారుతుంది. దీంతో ప్రస్తుత పని స్థానం గురించి తాజా సమాచారం అందుబాటులో ఉంటుంది.

వివరాలు 

ప్లాన్ చేసినది.. వాస్తవంగా ఉన్నది

టీమ్స్ ,అవుట్‌లుక్ క్యాలెండర్‌లో ఉద్యోగులు ముందుగానే తమ వర్క్ లొకేషన్‌ను నమోదు చేసుకోవచ్చు. అదే సమయంలో సిస్టమ్ గుర్తించిన వాస్తవ లొకేషన్ కూడా కనిపిస్తుంది. దీంతో ప్లాన్ చేసిన షెడ్యూల్, వాస్తవ పరిస్థితి మధ్య తేడా ఉంటే గుర్తించవచ్చు. లొకేషన్ షేరింగ్‌పై నియంత్రణ ఉద్యోగులు తమ లొకేషన్ సమాచారాన్ని సహోద్యోగులతో పంచుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమాచారం సంస్థ పరిధిలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మైక్రోసాఫ్ట్‌కు ఈ డేటా పంపబడదని సంస్థ స్పష్టం చేస్తోంది.

Advertisement

వివరాలు 

ఎప్పటి నుంచి అందుబాటులోకి?

ఈ ఫీచర్‌ను మొదట డిసెంబర్ 2025లో పరిమిత స్థాయిలో ప్రవేశపెట్టడం ప్రారంభించారు. అనంతరం షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకోవడంతో 2026లో దశలవారీగా మరిన్ని సంస్థలకు విస్తరించారు. ముఖ్యంగా ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉండదు. సంస్థల ఐటీ అడ్మిన్లు లేదా టెనెంట్ అడ్మిన్లు దీన్ని ప్రత్యేకంగా ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా ఆప్ట్-ఇన్ చేయాల్సి రావచ్చు. Microsoft 365 రోడ్‌మ్యాప్‌లో ఇది "Workplace Check-in" లేదా "Automatic Update of Work Location" ఫీచర్‌లో భాగంగా ఉంది.

Advertisement

వివరాలు 

విమర్శలు,వివాదాలు

కొత్త ఫీచర్‌పై సోషల్ మీడియా వేదికల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా Reddit, LinkedIn వంటి ప్లాట్‌ఫారమ్‌లలో కొందరు దీనిని "Snitch Feature", "Boss's Lapdog" వంటి పేర్లతో విమర్శిస్తున్నారు. ఉద్యోగుల ప్రైవసీపై ఇది ప్రభావం చూపుతుందని, మైక్రోమేనేజ్‌మెంట్‌ను ప్రోత్సహించే ప్రమాదం ఉందని విమర్శకులు అంటున్నారు. ఉద్యోగులపై అదనపు పర్యవేక్షణకు ఇది ఉపయోగపడవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

ప్రైవసీ రక్షణ కోసం చర్యలు

మైక్రోసాఫ్ట్ ఈ ఫీచర్‌లో కొన్ని భద్రతా చర్యలను కూడా అమలు చేసింది. లొకేషన్ డేటా ప్రతి రోజు చివర్లో తొలగించబడుతుంది. కేవలం వర్కింగ్ అవర్స్ సమయంలో మాత్రమే లొకేషన్ సమాచారం అప్‌డేట్ అవుతుంది. ఉద్యోగులు అవసరమైతే లొకేషన్ షేరింగ్‌ను నిలిపివేయవచ్చు. అయినప్పటికీ సంస్థ అడ్మిన్లు ఫీచర్‌ను ఎనేబుల్ చేసినప్పుడు ఉద్యోగులపై పరోక్ష ఒత్తిడి ఉండే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.

వివరాలు 

GPS ట్రాకింగ్ కాదు

ఈ ఫీచర్ GPS లేదా మొబైల్ లొకేషన్ ట్రాకింగ్ ఆధారంగా పనిచేయదు. ప్రధానంగా ఆఫీసు వై-ఫై నెట్‌వర్క్ కనెక్షన్‌ను ఆధారంగా చేసుకుని మాత్రమే ఉద్యోగి వర్క్ లొకేషన్‌ను నిర్ధారిస్తుంది. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు రిమోట్‌గా కనిపిస్తారు. మైక్రోసాఫ్ట్ ప్రకారం ఇది ఉద్యోగుల పర్యవేక్షణ కోసం కాకుండా సహకార వాతావరణాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడింది. అయితే ఉద్యోగుల విశ్వాసం, గోప్యత అంశాలపై ప్రభావం ఎలా ఉంటుందన్నది సంస్థలు ఈ ఫీచర్‌ను ఎలా అమలు చేస్తాయన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఉద్యోగులు తమ టీమ్స్ సెట్టింగ్స్‌లో లొకేషన్ షేరింగ్ ఎంపికలను పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement