MIT: ఎంఐటీ మరో సంచలనం.. నింగి, నీటిలో డైవ్ చేసే రోబో
ఈ వార్తాకథనం ఏంటి
ప్రకృతిలో కప్పలు వంటి అనేక ఉభయచర జీవులు రెండు భిన్న వాతావరణాల్లో జీవించగలవు. అలాగే గాల్లో ఎగిరి,అవసరమైనప్పుడు సముద్రంలోకి డైవ్ చేసి తిరిగి ఆకాశంలోకి చేరే పక్షులు శాస్త్రవేత్తలకు ఎప్పటినుంచో స్ఫూర్తిగా నిలిచాయి. ఈ సామర్థ్యాన్ని యంత్రంలోనూ ఆవిష్కరించాలన్న లక్ష్యంతో సాగిన పరిశోధనలకు ఇప్పుడు ఫలితం దక్కింది. అమెరికాలోని మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), స్విట్జర్లాండ్కు చెందిన ఈపీఎఫ్ఎల్ శాస్త్రవేత్తలు గాల్లో ఎగరడంతో పాటు నీటిలో ఈదగల వినూత్న రోబోను అభివృద్ధి చేశారు. రెక్కల సాయంతో ఇది ఆకాశంలో ప్రయాణించడమే కాకుండా, సముద్రంలోకి డైవ్ చేసి నీటిలోనూ సమర్థంగా కదలగలదు.
వివరాలు
ఈ సాంకేతికతను రూపొందించడం శాస్త్రవేత్తలకు పెద్ద సవాలు
అయితే ఈ సాంకేతికతను రూపొందించడం శాస్త్రవేత్తలకు పెద్ద సవాలుగా మారింది.
గాలితో పోలిస్తే నీటి సాంద్రత దాదాపు వెయ్యి రెట్లు ఎక్కువగా ఉండటంతో, గాల్లో ఎగరడానికి అనువైన రెక్కల నిర్మాణం నీటిలో ఎదురయ్యే అధిక నిరోధకతను తట్టుకోలేకపోతుంది.
దీంతో రెండు వాతావరణాల్లోనూ సమర్థంగా పనిచేసే డిజైన్ను రూపొందించాల్సి వచ్చింది.
ఈ సమస్యకు పరిష్కారం కోసం నీటిలో డైవింగ్ చేయగల దాదాపు 100 రకాల పక్షుల శరీర నిర్మాణం, రెక్కల పనితీరును శాస్త్రవేత్తలు లోతుగా పరిశీలించారు.
ఆ అధ్యయనం ఆధారంగా గాల్లో ఎగరడానికీ, నీటిలో ఈదడానికీ అనువుగా పనిచేసే ప్రత్యేక రెక్కల నమూనాను రూపొందించారు.
వివరాలు
కొత్త రోబోకు పేరు ఫ్లాపింగ్-వింగ్ ఏరియల్ అక్వాటిక్ వెహికల్
ఈ కొత్త రోబోకు ఫ్లాపింగ్-వింగ్ ఏరియల్ అక్వాటిక్ వెహికల్ అనే పేరు పెట్టారు. దీని బరువు సుమారు 300 గ్రాములు మాత్రమే.
భవిష్యత్తులో మహాసముద్రాల్లో పరిశోధనలు, సముద్ర జీవుల అధ్యయనం, క్లిష్ట ప్రాంతాల్లో అన్వేషణ వంటి కార్యక్రమాల్లో ఈ రోబో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.