LOADING...
Motorola: సరికొత్త అప్‌గ్రేడ్లతో భారత్‌లోకి 'మోటరోలా ఎడ్జ్ 70' ఎంట్రీ
సరికొత్త అప్‌గ్రేడ్లతో భారత్‌లోకి 'మోటరోలా ఎడ్జ్ 70' ఎంట్రీ

Motorola: సరికొత్త అప్‌గ్రేడ్లతో భారత్‌లోకి 'మోటరోలా ఎడ్జ్ 70' ఎంట్రీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2025
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

మోటరోలా యాజమాన్యం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే యూరప్‌, మిడిల్‌ ఈస్ట్‌ మార్కెట్లలో విడుదలైన మోటరోలా ఎడ్జ్‌ 70 స్మార్ట్‌ఫోన్‌ను భారత వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ముఖ్యమైన అప్‌గ్రేడ్లతో దేశీయ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. గ్లోబల్‌ వేరియంట్‌తో పోలిస్తే భారత్‌కు ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫోన్ డిసెంబర్‌ 15న అధికారికంగా లాంచ్ కానుంది. మోటరోలా ఎడ్జ్‌ 70 మూడు ఆకర్షణీయమైన కలర్‌ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. పాంటోన్ బ్రాంజ్‌ గ్రీన్‌, పాంటోన్ లిల్లీ ప్యాడ్‌, గాడ్జెట్ గ్రే రంగులు ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌లో మూడు 50MP కెమెరాలతో కూడిన అడ్వాన్స్‌డ్ కెమెరా సెటప్‌ను అందించారు.

Details

డిసెంబర్ 15న లాంచ్

అలాగే పెద్ద బ్యాటరీ, అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో ఈ డివైస్‌ను మరింత ప్రీమియంగా రూపొందించారు. విక్రయాల విషయానికి వస్తే, మోటరోలా ఎడ్జ్‌ 70ను ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్‌ 15న లాంచ్ అయిన వెంటనే అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. డిస్‌ప్లే పరంగా చూస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల pOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 1220 x 2712 పిక్సెల్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ప్రీమియం డిజైన్‌, శక్తివంతమైన కెమెరా ఫీచర్లు, ఆధునిక స్పెసిఫికేషన్లతో మోటరోలా ఎడ్జ్‌ 70 భారత మార్కెట్లో మంచి స్పందన పొందే అవకాశముందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement