NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / అంగారక గ్రహం మీదకు మనుషులను పంపే ప్రయత్నం: వన్ ఇయర్ ప్రోగ్రామ్ ని మొదలెట్టిన నాసా 
    తదుపరి వార్తా కథనం
    అంగారక గ్రహం మీదకు మనుషులను పంపే ప్రయత్నం: వన్ ఇయర్ ప్రోగ్రామ్ ని మొదలెట్టిన నాసా 
    అంగారక గ్రహం మాదిరి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న నాసా

    అంగారక గ్రహం మీదకు మనుషులను పంపే ప్రయత్నం: వన్ ఇయర్ ప్రోగ్రామ్ ని మొదలెట్టిన నాసా 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 26, 2023
    06:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అంగారక గ్రహం మీద మానవుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం అంగారక గ్రహం మీదకు మనుషులను పంపేందుకు నాసా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే అంగారక గ్రహం పరిస్థితులను భూమీద సృష్టించి వ్యోమగాములకు అంగారక పరిస్థితులను అలవాటు చేయిస్తోంది.

    హ్యూస్టన్ నగరంలో జాన్సన్ స్పేస్ సెంటర్ లో అంగారక గ్రహం మాదిరి పరిస్థితులను కల్పిస్తున్నారు. అరుణ గ్రహం మీదకు మనుషులను పంపేందుకు ప్రయత్నం చేస్తున్న ఈ మిషన్ ని మిషన్-1 అని పిలుస్తున్నారు.

    ఈ మిషన్, 2023 జూన్ 25మొదలై, 2024 జులై 7న ముగుస్తుంది. సంవత్సరం పాటు అంగార గ్రహం లాంటి పరిస్థితుల్లోనే వ్యోమగాములు నివసిస్తారన్నమాట.

    Details

    ఈ మిషన్ లో నలుగురు మనుషులు 

    ఈ మిషన్ లో నలుగురు క్రూ మెంబర్స్ ఉన్నారు. అందులో కెల్లీ హాట్సన్(క్రూ కమాండర్), రాస్ బ్రాక్ వెల్, నాథన్ జోన్స్, అంకా సేలరీ మెంబర్లుగా ఉన్నారు.

    ప్రస్తుతం ఈ నలుగురు వ్యోమగాములు 1700చదరపు అడుగుల మార్స్ డూనే ఆల్ఫాలో నివసిస్తున్నారు. 3డీ ప్రింటింగ్ తో తయారైన ఈ ప్రాంతం ఎర్రటి ఇసుకతో కప్పబడి ఉంటుంది.

    మార్స్ డూనే ఆల్ఫాలో నివసించే వ్యోమగాములు, అప్పుడు బయటకు వచ్చి 12200చదరపు అడుగుల ఇసుక బాక్స్ లో మార్స్ వాక్స్ చేస్తారు.

    మార్స్ డూనే ఆల్ఫాలో ఒక కిచెన్, రెండు బాత్రూమ్స్, కొన్ని ప్రైవేటు క్వార్టర్లు ఉంటాయి. ఈ మిషన్ లో ఉండే వ్యోమగాములు డ్రై ఫుడ్ తీసుకుంటారు.

    Details

    ఆరోగ్యం ఎలా ఉంటుందోనని ప్రయోగం 

    వ్యోమగాములు అందరూ మార్స్ డూనే ఆల్ఫా లో ఉంటే వారిని గమనిస్తూ బయట శాస్త్రవేత్తలు ఉంటారు. మార్స్ డూనే ఆల్ఫా నుండి ఏదైనా సమచారాన్ని బయట ఉన్న శాస్త్రవేత్తలకు చేరవేయడానికి 22నిమిషాల సమయం పడుతుంది.

    మార్స్ నుండి భూమికి ఏదైనా సమాచారం అందాలన్నా కూడా 22నిమిషాల సమయం పడుతుంది. అంగారక గ్రహంపై ఉండే గ్రావిటీ పరిస్థితులు మార్స్ డూనే ఆల్ఫాలో మాత్రం లేవు.

    ఈ ప్రయోగం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మార్స్ మీద ఉండే పరిస్థితుల మనుషుల ఆరోగ్యాలను ఏ విధంగా ప్రభావితం చేయనున్నాయో తెలుసుకోవడం. అందుకే శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నవారినే ఈ మిషన్ కోసం ఎంచుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    శాస్త్రవేత్త

    తాజా

    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి
    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా

    టెక్నాలజీ

    ఏప్రిల్ 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఏప్రిల్ 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన నోకియా C12 ప్లస్ స్మార్ట్ ఫోన్
    ఫిబ్రవరి 2023లో 45 లక్షలకు పైగా భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్ వాట్సాప్

    శాస్త్రవేత్త

    30 సంవత్సరాల తర్వాత నిలిచిపోయిన నాసా జియోటైల్ మిషన్ నాసా
    ఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం చంద్రుడు
    నాసా వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ గుర్తించిన చారిక్లో అనే గ్రహశకలం నాసా
    ఆర్టెమిస్ 2 మిషన్ కోసం సిద్దంగా ఉన్న నాసా SLS రాకెట్ నాసా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025