NASA: అంతరిక్ష కేంద్రంలో కొత్త ల్యాప్టాప్లు.. వ్యోమగాములకు అధునాతన సిస్టమ్స్
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో పనిచేస్తున్న ఎక్స్పెడిషన్ 74 బృందానికి నాసా భారీ అప్గ్రేడ్ అందిస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైందని నాసా వెల్లడించింది. మొదట నెట్వర్క్ సర్వర్లను మార్చి, తర్వాత కొత్త శక్తివంతమైన ల్యాప్టాప్లను యాక్టివేట్ చేస్తున్నారు. ఈసారి HP ZBook G9 మొబైల్ వర్క్స్టేషన్ను ఎంపిక చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ల్యాప్టాప్లో అత్యాధునిక ప్రాసెసర్, గ్రాఫిక్స్, ఎక్కువ మెమరీ, భారీ స్టోరేజ్ ఏర్పాటు చేశారు.
వివరాలు
నాసా కోసం ప్రత్యేకంగా డీసీ పవర్ అడాప్టర్
భూమిపై వాడే చార్జర్లు అంతరిక్షంలో పని చేయవు కాబట్టి, నాసా కోసం ప్రత్యేకంగా డీసీ పవర్ అడాప్టర్ కూడా రూపొందించారు. 2025 అక్టోబర్ నుంచి పాత మోడళ్లను తొలగించి కొత్తవాటిని అమర్చుతున్నారు. ప్రస్తుతం 100కుపైగా ల్యాప్టాప్లు ISSలో పనిచేస్తున్నాయి. మైక్రోగ్రావిటీ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రింటర్లు కూడా వాడుతున్నారు. అయితే 2030లో ISSను నిలిపివేయనున్నందున, ఇలాంటి అప్గ్రేడ్లు భవిష్యత్తులో చాలా తక్కువే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.