Loading...
Jensen Huang : ఏఐ వేగం తగ్గనివ్వం.. ట్రంప్‌తో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్
ఏఐ వేగం తగ్గనివ్వం.. ట్రంప్‌తో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్

Jensen Huang : ఏఐ వేగం తగ్గనివ్వం.. ట్రంప్‌తో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

లాస్‌ఏంజెలెస్‌లో సోమవారం ఉదయం జరిగిన 'ఆల్-ఇన్ సమ్మిట్‌'లో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రసంగిస్తుండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ కాల్‌ను వాయిస్‌మెయిల్‌కు పంపే పరిస్థితి లేకపోవడంతో హువాంగ్ వెంటనే స్పందించారు. ''నేను నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌తో వేదికపై ఉన్నాను'' అని ట్రంప్‌తో అన్నారు. 'ఆల్-ఇన్' పాడ్‌కాస్ట్ నిర్వహించే వెంచర్ క్యాపిటలిస్టులు చమత్ పాలిహపిటియా, జేసన్ కలకానిస్, వైట్‌హౌస్ సలహాదారులు డేవిడ్ ఫ్రైడ్‌బర్గ్, డేవిడ్ సాక్స్‌లను ఉద్దేశించి హువాంగ్ ఈ వ్యాఖ్య చేశారు. అంతటితో ఆగకుండా హువాంగ్ ట్రంప్‌ను స్పీకర్‌లో పెట్టి సభలో ఉన్నవారికి సంభాషణ వినిపించారు.

వివరాలు 

ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలన్న ఆంత్రోపిక్‌ సీఈఓ

''ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన కంప్యూటర్ చిప్‌ను జెన్సన్ తయారు చేయగలరు. కానీ మిమ్మల్ని స్పీకర్‌లో ఎలా పెట్టాలో మాత్రం గుర్తించలేకపోతున్నారు'' అని ట్రంప్ ఫోన్‌లో సరదాగా వ్యాఖ్యానించారు.

అయితే, హువాంగ్‌కు స్పీకర్‌ఫోన్‌ ఎలా పనిచేస్తుందో తెలియక కాదు. కాల్‌ శబ్దం ప్రేక్షకులకు స్పష్టంగా వినిపించేందుకు అదనపు మైక్రోఫోన్‌ కోసం ఆయన వేదిక సిబ్బందిని అడుగుతున్నారు.

వేదికపై అంతకుముందు ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలన్న ఆంత్రోపిక్‌ సీఈఓ డారియో అమోడీ పిలుపుపై చర్చ జరిగింది.

ఏఐ సామర్థ్యాల అభివృద్ధి వేగాన్ని కొంత తగ్గించాలని అమోడీ సూచించారు.

స్పేస్‌ఎక్స్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్,ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్‌ ఆల్ట్‌మన్‌ కూడా ఈ అభిప్రాయానికి బహిరంగంగా మద్దతు తెలిపారు.

అయితే, హువాంగ్‌ అభిప్రాయాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి.

వివరాలు 

'అది జరగనివ్వం సర్‌': హువాంగ్

''ఏఐ అభివృద్ధి ఆగిపోవాలని కోరుకునే చాలామందికి వారు తెలియకుండానే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అలా కోరుకునేవారు రాజకీయ నాయకులు కావచ్చు.. చైనా కూడా కావచ్చు. అది జరగనివ్వం. ఇదంతా ఒక మోసం'' అని ట్రంప్‌ అన్నారు.

దీనికి హువాంగ్‌ స్పందిస్తూ.. ''మీరు చెప్పింది నిజమే. అది జరగనివ్వం సర్‌'' అని అన్నారు. దీంతో సభలో చప్పట్లు మార్మోగాయి.

ADVERTISEMENT

వివరాలు 

డేటా సెంటర్ల నిర్మాణాన్నివ్యతిరేకిస్తున్న అమెరికన్లు

డేటా సెంటర్ల నిర్మాణానికి వ్యతిరేకంగా పెరుగుతున్న ప్రజాభిప్రాయం.. అమెరికా ఆర్థిక అభివృద్ధిని అడ్డుకునేందుకు జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో భాగమని ట్రంప్, ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు.

వై కాంబినేటర్‌ సీఈఓ గ్యారీ టాన్‌ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే, ప్రజల ఆందోళనలకు ప్రధాన కారణాలు మరింత స్పష్టంగా ఉన్నాయని ఇటీవలి గ్యాలప్‌ సర్వే వెల్లడించింది.

తమ ప్రాంతంలో డేటా సెంటర్ల నిర్మాణాన్ని 10 మందిలో ఏడుగురు అమెరికన్లు వ్యతిరేకిస్తున్నట్లు సర్వేలో తేలింది.

50 శాతానికి పైగా మంది పర్యావరణ వనరులపై డేటా సెంటర్ల ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

మరో 20 శాతం మంది జీవన వ్యయం పెరగడం, జీవన నాణ్యతపై ప్రభావం గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

''నేను మీకు పూర్తిగా మద్దతుగా ఉన్నాను": ట్రంప్

''మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. పనులు బాధ్యతాయుతంగా, ఆచితూచి చేయాలి. అయితే, అందువల్ల ఒక పరిశ్రమను ఆపేయాలని కాదు'' అని ట్రంప్‌ హువాంగ్‌తో అన్నారు.

''నేను మీకు పూర్తిగా మద్దతుగా ఉన్నాను. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో నాకు ఇంతకుముందు తెలియదు. కానీ, మీరు కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తారని ఆశించాను. మనం ముందుండి నడిపిస్తాం'' అని ట్రంప్‌ పేర్కొన్నారు.

ADVERTISEMENT