NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Oppo K13 5G: బిగ్‌ బ్యాటరీతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన ఒప్పో.. గంటలోనే బ్యాటరీ ఫుల్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Oppo K13 5G: బిగ్‌ బ్యాటరీతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన ఒప్పో.. గంటలోనే బ్యాటరీ ఫుల్‌
    బిగ్‌ బ్యాటరీతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన ఒప్పో.. గంటలోనే బ్యాటరీ ఫుల్‌

    Oppo K13 5G: బిగ్‌ బ్యాటరీతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన ఒప్పో.. గంటలోనే బ్యాటరీ ఫుల్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 21, 2025
    03:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో,తన కొత్త ఫోన్‌ "ఒప్పో K13 5జీ"ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

    గత సంవత్సరంలో వచ్చిన K12 మోడల్‌కు కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను కంపెనీ పరిచయం చేసింది.

    భారీ బ్యాటరీ సామర్థ్యం,వేగవంతమైన ఛార్జింగ్‌ సదుపాయాలతో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది.

    ఇప్పుడు దీని విశేషాలను తెలుసుకుందాం.

    ఒప్పో K13 5జీ ఫోన్‌ 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది.ఇది 120Hz రిఫ్రెష్‌రేట్‌, గరిష్టంగా 1200 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

    ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పాటు కలర్‌ ఓఎస్‌ 15తో నడుస్తోంది. వెట్‌ టచ్‌, గ్లోవ్‌ మోడ్‌ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

    వివరాలు 

    7000 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల భారీ బ్యాటరీ 

    ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 6th జనరేషన్‌ 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.కెమెరా సెక్షన్‌లో వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్‌ సెకండరీ కెమెరా ఉన్నాయి.

    సెల్ఫీల కోసం ముందుభాగంలో 16 మెగాపిక్సెల్‌ కెమెరా ఏర్పాటు చేశారు. ఇంకా ఏఐ ఆధారిత ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి,ఉదాహరణకు - AI క్లారిటీ ఎన్‌హ్యాన్సర్‌, AI రిఫ్లెక్షన్‌ రిమూవర్‌, AI అన్‌బ్లర్‌, AI ఎరేజర్‌ 2.0 వంటివి.

    అలాగే ఐఆర్‌ రిమోట్‌ కంట్రోల్‌,డ్యూయల్‌ స్టీరియో స్పీకర్ల మద్దతు కూడా ఈ ఫోన్‌లో ఉంది.

    ఈ ఫోన్‌లో 7000 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉంది.ఇది 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

    వివరాలు 

    రెండు ఆకర్షణీయమైన రంగుల్లో..

    కంపెనీ ప్రకారం, 0 నుంచి 62 శాతం ఛార్జ్‌ చేసేందుకు కేవలం 30 నిమిషాల సమయం సరిపోతుంది. అలాగే పూర్తి 100 శాతం ఛార్జింగ్‌ కోసం 56 నిమిషాలు మాత్రమే పడుతుంది.

    డిజైన్‌ పరంగా చూస్తే ఈ ఫోన్‌ 8.45 మిల్లీమీటర్ల మందంతో, సుమారు 208 గ్రాముల బరువుతో రూపొందించబడింది.

    ధర విషయానికి వస్తే, 8జీబీ RAM + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.17,999గా నిర్ణయించబడింది.

    256జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.19,999గా ఉంది.

    పర్పుల్‌, ప్రిజమ్‌ బ్లాక్‌ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి వస్తోంది.

    ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌ మరియు ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా ఈ ఫోన్‌ విక్రయాలు ఏప్రిల్‌ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మొబైల్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    మొబైల్

    Mobile users ID: మొబైల్ వినియోగదారులకు ప్రత్యేక ఐడీ ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం  ఆధార్ కార్డ్
    Suicide for mobile: ఫోన్ కోసం 16ఏళ్ల బాలుడు ఆత్మహత్య  తాజా వార్తలు
    Mobile Phone Addiction : సెల్'ఫోన్'కు బానిసగా మారారా.. జస్ట్ ఈ ఒక్క పనిచేయండి అంతే  మానసిక ఆరోగ్యం
    Poonch attack: జమ్ముకశ్మీర్‌‌లో ఉగ్రవాదుల వేట.. మొబైల్ ఇంటర్నెట్ సస్పెండ్  జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025