NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Planetary Parade: నేడు ఆకాశంలో గ్రహాల కవాతు.. ఒకే సరళ రేఖపై 7 గ్రహాలు.. ఏ టైమ్‌లో చూడొచ్చంటే?
    తదుపరి వార్తా కథనం
    Planetary Parade: నేడు ఆకాశంలో గ్రహాల కవాతు.. ఒకే సరళ రేఖపై 7 గ్రహాలు.. ఏ టైమ్‌లో చూడొచ్చంటే?
    నేడు ఆకాశంలో గ్రహాల కవాతు.. ఒకే సరళ రేఖపై 7 గ్రహాలు.. ఏ టైమ్‌లో చూడొచ్చంటే?

    Planetary Parade: నేడు ఆకాశంలో గ్రహాల కవాతు.. ఒకే సరళ రేఖపై 7 గ్రహాలు.. ఏ టైమ్‌లో చూడొచ్చంటే?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 28, 2025
    11:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇవాళ రాత్రి ఆకాశంలో ఒక మహద్భుతమైన ఖగోళ సంఘటన సాక్షాత్కారమవుతుంది.

    సౌర కుటుంబంలోని ఏడు గ్రహాలు సూర్యుడికి ఒకే వైపునకు చేరి, ఒకే సరళరేఖలో కనబడతాయి.

    ఖగోళ శాస్త్రంలో దీనిని "ప్లానెట్ పరేడ్" అని పిలుస్తారు. మహాశివరాత్రి అనంతరం గ్రహాల ఈ అద్భుతమైన కూడిక ఆకాశాన్ని మరింత విశేషంగా మార్చనుంది.

    మన రిపబ్లిక్ డే పరేడ్‌లానే... ఇవాళ గ్రహాలు కూడా ఖగోళ కవాతుగా కనిపించనున్నాయి.

    ఈ సందర్భంగా శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు వంటి గ్రహాలను ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేకుండానే మన కళ్లతోనే తిలకించవచ్చు.

    అయితే నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూడాలంటే టెలిస్కోప్ అవసరం అవుతుంది.

    వివరాలు 

    మన దేశంలోనూ ప్లానెట్ పరేడ్.. 

    గత జనవరి 21న 6 గ్రహాలు ప్లానెట్ పరేడ్‌లో కనిపించాయి. కానీ ఈసారి ఏకంగా 7 గ్రహాలు ఒకే లైనులో ప్రత్యక్షమవుతాయి.

    ఇప్పటికే శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, నెప్ట్యూన్, యురేనస్ ఒకే వరుసలో ఉంటే, ఇప్పుడు బుధుడు కూడా ఈ సరళరేఖలో చేరిపోతున్నాడు.

    ఈ అరుదైన ఖగోళ దృశ్యం ఇవాళ మనకు వీక్షణం కానుంది. ఈ ప్లానెట్ పరేడ్ మన దేశంలోనూ కనిపించనుంది.

    ఇవాళ రాత్రి 8:30 గంటల సమయంలో ఈ సప్త గ్రహ కూటమి దర్శనమిస్తుంది.

    ఆకాశం మేఘాల నుంచి స్వేచ్ఛ పొందితే, కాలుష్యం తక్కువగా ఉంటే ఈ దృశ్యం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది.

    వివరాలు 

    మళ్లీ 2040లో..

    అంతేకాకుండా, "స్టార్ వాక్-2", "స్టెల్లారియం" లాంటి యాప్‌ల ద్వారా కూడా ఈ ఖగోళ కవాతును వీక్షించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

    అయితే, ఈ గ్రహ పరేడ్ ప్రభావంతో ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉందని, కొన్ని రాశుల వారికి ఇది అనుకూలించదని జ్యోతిష పండితులు అంటున్నారు.

    ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం ఇది ఒక అరుదైన ఖగోళ సంఘటన మాత్రమేనని, దీని వల్ల భూలోకంలో ఎలాంటి ఉపద్రవాలు జరుగవని స్పష్టం చేస్తున్నారు.

    ఈ సప్త గ్రహ పరేడ్‌ను ఈసారి మిస్ అయితే, మళ్లీ 2040లో మాత్రమే ఇలాంటి అరుదైన దృశ్యాన్ని చూడగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సైన్స్ అండ్ టెక్నాలజీ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    సైన్స్ అండ్ టెక్నాలజీ

    Microscope: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మైక్రోస్కోప్.. సెకనులో 1 క్వింటిలియన్ వంతు వద్ద సమయాన్ని స్తంభింపజేస్తుంది టెక్నాలజీ
    Myopia: ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న పిల్లల కంటి చూపు.. ముగ్గురు చిన్నారుల్లో ఒక్క‌రికి మ‌యోపియా ల‌క్ష‌ణాలు న‌మోదు  టెక్నాలజీ
    Global Pandemic: కరోనా తర్వాత ప్రపంచ మహమ్మారిపై శాస్త్రవేత్తల రీసెర్చ్.. తర్వాత ప్రపంచాన్ని కలవరపెట్టే ''మహమ్మారి'' ఇదేనా..? టెక్నాలజీ
    Black Moon: ఆకాశంలో 'బ్లాక్ మూన్' ఎప్పుడు కనిపిస్తుంది.. ఎలా చూడాలంటే..? టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025