చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసిన రోవర్.. ట్వీట్ చేసిన ఇస్రో
చంద్రయాన్-3 ప్రయోగంలో చంద్రుడిపై దిగిన ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. తాజాగా విక్రమ్ ల్యాండర్ ఫోటోలను ప్రజ్ఞాన్ రోవర్ నావిగేషన్ కెమెరా (నవ్క్యామ్) తీసింది. ఆ ఫోటోలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ట్విట్టర్లో షేర్ చేసింది. ఆగస్టు 30, ఉదయం 7:35 గంటలకు విక్రమ్ ల్యాండర్ ఫోటోలను రోవర్ క్లిక్ మనిపించినట్లు ఇస్రో తెలిపింది. చంద్రయాన్-3 ఆగష్టు 23, 2023న చంద్రునిపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఆగస్టు 24 నుంచి తమ పనిని మొదలు పెట్టాయి. ఈ రెండు సెప్టెంబర్ మొదటి వారం వరకు చంద్రుడిపై ప్రయోగాలు నిర్వహించనున్నాయి.