NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Prophase: సైబర్ యుద్ధంలో భారత్‌ రక్షణ కవచంగా నిలిచిన 'ప్రొఫేజ్‌'
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Prophase: సైబర్ యుద్ధంలో భారత్‌ రక్షణ కవచంగా నిలిచిన 'ప్రొఫేజ్‌'
    సైబర్ యుద్ధంలో భారత్‌ రక్షణ కవచంగా నిలిచిన 'ప్రొఫేజ్‌'

    Prophase: సైబర్ యుద్ధంలో భారత్‌ రక్షణ కవచంగా నిలిచిన 'ప్రొఫేజ్‌'

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 16, 2025
    03:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరువనంతపురం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సైబర్‌ సెక్యూరిటీ స్టార్టప్‌ "ప్రొఫేజ్" మే 5న ప్రారంభమైన సైబర్‌ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంది.

    నాలుగు రోజుల పాటు నిరంతరం ముప్పులను గుర్తించి అరుదైన ఘనత సాధించింది. కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం, ఆ సమయంలో దాదాపు 85 మిలియన్ల సైబర్‌ ముప్పులను గుర్తించి బ్లాక్‌ చేసినట్లు స్పష్టం చేసింది.

    అంతేకాక మూడు విమానాశ్రయాలపై జరిగే దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. వీటిలో ఒకటి టియర్‌-1 విమానాశ్రయమని, సంస్థ వెల్లడించినా పేరు గోప్యంగా ఉంచింది.

    Details

    ముందే ముప్పును కనిపెట్టిన ప్రొఫేజ్‌

    2019లో వైశాఖ్ టీఆర్, లక్ష్మీదాస్‌ల ఆధ్వర్యంలో స్థాపించిన ప్రొఫేజ్‌ సంస్థ, సంస్థలకు తేలికైన, వేగవంతమైన సైబర్‌ భద్రతను అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

    ప్రస్తుతం భారత్‌లోని 100కి పైగా సంస్థలకు ప్రొఫేజ్ సేవలందిస్తోంది.

    భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య భౌతిక యుద్ధం మొదలయ్యే ముందు నుంచే సైబర్‌ దాడులు ప్రారంభమయ్యాయని ప్రొఫేజ్ సహ స్థాపకురాలు, సీఓఓ లక్ష్మీదాస్ తెలిపారు.

    మే 5న చిన్న స్థాయిలో ప్రారంభమైన దాడులు మే 8, 9 తేదీల్లో తీవ్రమయ్యాయని, కానీ తమ టెక్నాలజీ వాడిన అన్ని సంస్థలకూ సర్వీసుల్లో ఎటువంటి అంతరాయం కలగలేదని ఆమె స్పష్టం చేశారు.

    Details

    గతంలోనూ విమానాశ్రయాలను రక్షించిన అనుభవం

    ప్రతి రోజు మారుతున్న దాడుల పద్ధతులను జియో ఫెన్సింగ్‌, ఐటీ ప్రొఫైలింగ్‌, బిహేవియరల్‌ అనాలసిస్‌ వంటి అధునాతన పద్ధతులతో గుర్తించి ఎదుర్కొన్నామని లక్ష్మి చెప్పారు.

    పలు దేశాల నుంచి వచ్చిన ముప్పులు ఎక్కువగా ప్రో-పాకిస్తాన్ గ్రూపులవేనని వెల్లడించారు.

    2023లో హ్యాకింగ్‌ గ్రూప్‌ 'అనానిమస్' ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ దాడులకు పాల్పడినప్పుడు కూడా భారత విమానాశ్రయాలపై ముప్పు ఏర్పడింది.

    అప్పుడు మూడు ప్రధాన విమానాశ్రయాలకు ప్రొఫేజ్‌ సేవలందించింది.

    Details

    'మేడ్ ఇన్ ఇండియా' సైబర్‌ టెక్‌కు మద్దతు ఇవ్వండి

    ఇప్పుడు భారత సంస్థలు విదేశీ సైబర్‌ సెక్యూరిటీ ఉత్పత్తులపై ఆశ్రితంగా ఉన్నాయి.

    కానీ సమయం వచ్చింది... దేశీయంగా తయారు చేసిన, సంస్థకు అనుగుణంగా మెరుగుపరిచిన సెక్యూరిటీ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని లక్ష్మీదాస్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ

    తాజా

    Prophase: సైబర్ యుద్ధంలో భారత్‌ రక్షణ కవచంగా నిలిచిన 'ప్రొఫేజ్‌' టెక్నాలజీ
    Pillalamarri Banyan Tree: నేడు పాలమూరుని సందర్శించనున్న ప్రపంచ అందగత్తెలు !  తెలంగాణ
    SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు   స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    unemployment data: దేశంలో తొలిసారిగా నెలవారీ ఉద్యోగ గణాంకాలు.. ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1శాతం కేంద్ర ప్రభుత్వం

    టెక్నాలజీ

    WhatsApp: మీ వాట్సాప్ కాల్‌ల్లో లొకేషన్ ట్రాక్ అవుతుందా? అయితే ఈ సెట్టింగ్స్ అవసరం వాట్సాప్
    Truecaller: ఏఐ ఆధారిత 'Message ID' తో ట్రూకాలర్‌లో కొత్త ఫీచర్  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్‌తో సమస్యలకు చెక్! వాట్సాప్
    TRAI: అప్‌డేట్ చేసిన DND యాప్‌ను లాంచ్ చేయనున్న ట్రాయ్ .. స్పామ్ కాల్‌లు నియంత్రించబడతాయి టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025