Sarvam : ఏఐ రంగంలో సర్వమ్ ఏఐ సంచలనం.. 'మేడ్ ఇన్ ఇండియా' గ్లాసెస్ ఆవిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ సర్వమ్ ఏఐ దేశంలోనే తొలి ఏఐ వేరబుల్ గ్లాసెస్గా 'సర్వమ్ కాజే'ను విడుదల చేసింది. ఫిబ్రవరి 16న జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఈ ఉత్పత్తిని ఆవిష్కరించగా, ఇది 'మేడ్ ఇన్ ఇండియా'గా తయారైన తొలి ఏఐ వేరబుల్ కావడంతో పాటు హార్డ్వేర్ వేరబుల్స్ రంగంలోకి సర్వమ్ ఏఐ అడుగుపెట్టిన కీలక ఘట్టంగా కంపెనీ పేర్కొంది. ఇదే వేదికపై ఈ వారం చివర్లో కొత్త చాట్ మోడల్ను కూడా విడుదల చేయనున్నట్టు సహ-సంస్థాపకుడు ప్రత్యూష్ కుమార్ వెల్లడించారు.
వివరాలు
'సర్వమ్ అక్షర్'తో డాక్యుమెంట్ డిజిటైజేషన్
క్లౌడ్ అవసరం లేకుండా ల్యాప్టాప్లు, మొబైల్లపై పనిచేసే ఆఫ్లైన్ ఏఐ మోడల్ 'సర్వమ్ ఎడ్జ్'తో ఇప్పటికే వార్తల్లో నిలిచిన ఈ స్టార్టప్,భారత్కు అనుకూలమైన పనుల్లో ఓపెన్ఏఐ చాట్జీపీటీ, గూగుల్ జెమినీ వంటి గ్లోబల్ దిగ్గజాలకన్నా మెరుగైన ఫలితాలు సాధించామని తెలిపింది. తక్కువ మెమరీ,తక్కువ కంప్యూట్తోనూ పెద్ద మోడళ్ల స్థాయి ఖచ్చితత్వం అందించడమే లక్ష్యమని, సమర్థవంతమైన,గోప్యతను కాపాడే,ఎక్కడైనా అందుబాటులో ఉండే ఏఐని రూపొందించడమే తమ దృష్టికోణమని కుమార్ చెప్పారు. అంతేకాదు,భారతదేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో ఏఐ ప్రాప్తిని పెంచే దిశగా 'సర్వమ్ అక్షర్'ను కూడా తాజాగా ప్రవేశపెట్టగా,క్లిష్టమైన వాస్తవ ప్రపంచ పత్రాల డిజిటైజేషన్లో అత్యాధునిక ఖచ్చితత్వాన్ని అందిస్తుందని, భారత సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే తమ ప్రయత్నాలకు ఇది బలమైన పునాది అవుతుందని కంపెనీ పేర్కొంది.