
Shubhanshu Shukla: తల్లిదండ్రులతో శుభాంశు శుక్లా వీడియోకాల్.. రోదసియాత్ర ముందు ఏమన్నారో?
ఈ వార్తాకథనం ఏంటి
తన చారిత్రాత్మక రోదసియాత్రకై కొన్ని గంటల ముందు శుభాంశు శుక్లా తన తల్లిదండ్రులతో వీడియోకాల్లో మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వెళ్లే స్పేస్ఎక్స్ అంతరిక్ష నౌకలో ఎక్కడానికి సిద్ధమైన శుభాంశు, తన కుటుంబానికి 'నా కోసం వేచిచూడండి. నేను తిరిగి వస్తానని సందేశం ఇచ్చారు. ఆ సందర్భంలో శుభాంశు తల్లి సంప్రదాయాన్ని పాటిస్తూ చక్కెర, పెరుగుతో కలిపిన మిశ్రమాన్ని వీడియోకాల్ ద్వారా 'వర్చువల్'గా శుభాంశుకు తినిపించారు. భారత్లో ఏదైనా ముఖ్య కార్యక్రమం ప్రారంభించేముందు ఇలా చేయడం అనేది ఎంతో ప్రాచుర్యం ఉన్న సంప్రదాయం. ఇలా తినిపిస్తే మంచి జరుగుతుందనే విశ్వాసం ఉంది. తన కుమారుడి రోదసియాత్రపై శుభాంశు తల్లి ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
Details
కన్నీళ్లు కాదు.. ఆనందబాష్పాలు!
మాకు ఎంతో గర్వంగా ఉంది. మేమేమాత్రం భయపడటం లేదు. శుభాంశును వెళ్లి మిషన్ పూర్తి చేయమని ప్రోత్సహించామని చెప్పారు. ఇవి కన్నీళ్లు కాదు.. ఆనందబాష్పాలు!శుభాంశు ఎంతో దూరం వెళ్తున్నందుకే అమ్మ భావోద్వేగానికి లోనైందనని శుభాంశు సోదరి తెలిపారు. శుభాంశును తీసుకెళ్తున్న ఫాల్కన్ 9 రాకెట్ ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. కొద్ది నిమిషాల తర్వాత రాకెట్ నుంచి విడిపోయిన వ్యోమనౌక భూకక్ష్యలోకి ప్రవేశించింది. 28 గంటల ప్రయాణం తరువాత, గురువారం సాయంత్రం 4.30 గంటలకు వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో అనుసంధానం కానుంది. అక్కడ శుభాంశుతో పాటు ఇతర వ్యోమగాములు 14 రోజుల పాటు ఉంటూ శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తారు.