NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Sunita Williams: సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ రాకపై ఉత్కంఠ.. షెడ్యూల్ కంటే ముందేగానే భూమికి రాక 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Sunita Williams: సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ రాకపై ఉత్కంఠ.. షెడ్యూల్ కంటే ముందేగానే భూమికి రాక 
    సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ రాకపై ఉత్కంఠ.. షెడ్యూల్ కంటే ముందేగానే భూమికి రాక

    Sunita Williams: సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ రాకపై ఉత్కంఠ.. షెడ్యూల్ కంటే ముందేగానే భూమికి రాక 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 12, 2025
    03:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ వారం రోజుల మిషన్ కోసం వెళ్లి, సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

    సాంకేతిక లోపాల కారణంగా ఈ ఇద్దరు వ్యోమగాములు ఇప్పటికే 8 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు.

    వారిని భూమికి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు పలు మార్లు విఫలమయ్యాయి.

    ఈ నేపథ్యంలో వారి రాకపై ఉత్కంఠ నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం, వీరు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే త్వరలోనే భూమిపైకి రానున్నట్టు తెలుస్తోంది.

    తాజా రీ-షెడ్యూల్ ప్రకారం, అన్నీ సజావుగా జరిగితే వీరు మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో భూమిపైకి తిరిగి వస్తారని నాసా గతంలో ప్రకటించింది.

    Details

    మార్చి 12న రాక?

    కానీ అంతకంటే ముందే వీరి రాక సాధ్యమవుతుందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

    నాసా వర్గాల సమాచారం ప్రకారం, మార్చి 12 నాటికి వీరిని భూమికి తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    ఇందుకోసం స్పేస్ ఎక్స్ 10 మిషన్‌లో ఉపయోగించిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ ను ఉపయోగించనున్నట్టు సమాచారం.

    భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ 2023 జూన్‌లో బోయింగ్ స్టార్‌లైన్‌ స్పేస్‌షిప్ ద్వారా ఐఎస్ఎస్‌కి వెళ్లారు.

    వాస్తవానికి, వీరి మిషన్‌ కేవలం వారం రోజుల పాటు మాత్రమే ఉండాలి. జూన్ 6న ఐఎస్ఎస్‌కి వెళ్లిన వీరు, జూన్ 14న భూమికి తిరిగి రావాల్సి ఉంది.

    Details

    తిరుగు ప్రయాణం పలుసార్లు వాయిదా

    కానీ, స్టార్‌లైనర్‌లో హీలియం లీకేజీ వంటి సాంకేతిక లోపాలు తలెత్తడంతో వారి తిరుగు ప్రయాణం పలుమార్లు వాయిదా పడింది.

    నాసా, స్పేస్‌ ఎక్స్ కలిసి వీరిని భూమికి రప్పించేందుకు పలు మార్లు ప్రయత్నాలు చేశాయి. ఫిబ్రవరి 2025లో వీరిని భూమికి తిరిగి తీసుకురావడానికి నాసా ప్రణాళికలు సిద్ధం చేసింది.

    కానీ, ఈ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో వారు మరొక నెల రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    అయితే తాజా అప్‌డేట్ ప్రకారం వీరు ముందుగా భావించిన సమయానికంటే తొందరగానే భూమిపైకి రానున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సునీతా విలియమ్స్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం
    IPL 2025: ఐపీఎల్ 2025 గేమ్ ఛేంజర్లు.. బ్యాటింగ్, బౌలింగ్ స్టార్లు ఎవరో తెలుసా? ఐపీఎల్
    PM Modi: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని కేంద్ర కేబినెట్
    Odisha: ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్‌.. ఐదుగురు రోగులు మృతి ఒడిశా

    సునీతా విలియమ్స్

    Sunita Williams: 225 రోజుల పాటు కక్ష్యలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. 6 గంటల సుదీర్ఘ అంతరిక్ష నడక పూర్తి  టెక్నాలజీ
    Sunita Williams: సునీతా విలియమ్స్ తన తదుపరి స్పేస్‌వాక్ ఎప్పుడు చేస్తారు.. అది ఎలా చూడాలి? టెక్నాలజీ
    Sunita Williams: ఏడు నెలలుగా అంతరిక్షంలోనే.. ఎలా నడవాలో మర్చిపోయిన సునీతా విలియమ్స్‌..! టెక్నాలజీ
    Sunitha Williams: సునీతా విలియమ్స్ తొమ్మిదోసారి స్పేస్​వాక్ నాసా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025